ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మంగళూరు భామ కృతి శెట్టి ఇప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్ గా ఉంది.యంగ్ హీరోలు అందరూ కూడా కృతి శెట్టి కోసమే ప్రయత్నం చేస్తున్నారు.
రష్మిక, పూజా హెగ్డే తమ బడ్జెట్ రేంజ్ దాటిపోవడంతో వారికి దీటుగా ఉండే కృతి శెట్టితో రొమాన్స్ చేయాలని ఆశ పడుతున్నారు.ఈ నేపధ్యంలో ఈ బ్యూటీకి టాలీవుడ్ లో ఫుల్ డిమాండ్ పెరిగింది.
ఈ నేపధ్యంలో యంగ్ స్టార్ హీరోల సినిమాలకి కృతి శెట్టి పేరు తెరపైకి వస్తుంది.దర్శక, నిర్మాతలు కూడా ఆమె డేట్స్ కోసం ట్రై చేస్తున్నారనే ప్రచారం ఉంది.
అయితే ఈ క్రేజీ బ్యూటీ మాత్రం తన కొత్త సినిమాల విషయంలో అందరికి ఒక క్లారిటీ ఇచ్చేసింది.ప్రస్తుతం తాను తెలుగులో మూడు సినిమాలు మాత్రమే కమిట్ అయ్యానని.
సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు మిగిలిన ఏ సినిమాలకి తాను ఒకే చెప్పలేదని చెప్పుకొచ్చింది.
తన నెక్స్ట్ సినిమాల విషయంలో పూర్తిగా తానే క్లారిటీ ఇస్తానని, అప్పటి వరకు ఎలాంటి ప్రచారాలు వద్దని చెప్పింది.
ఈ బ్యూటీ మాటల బట్టి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు కొత్త సినిమాలకి ఒకే చెప్పడం, రిజక్ట్ చేయడం లాంటివి జరగలేదని తెలుస్తుంది.అయితే సినిమాల కోసం ఆమెతో సంప్రదింపులు అయితే జరుగుతున్నాయని అర్ధమవుతుంది.
ప్రస్తుతం ఈ భామ నానితో శ్యామ్ సింగరాయ్, సుదీర్ బాబుతో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.అలాగే లింగుస్వామి దర్శకత్వంలో రామ్ కి జోడీగా ఒక సినిమాలో నటిస్తుంది.
కృతి శెట్టి కోలీవుడ్ ఎంట్రీ ఇస్తుందనేవార్తలలో కూడా వాస్తవం లేదని మాత్రం తెలుస్తుంది.ఏది ఏమైనా ఈ బ్యూటీ క్రేజ్ కి ఈ మాత్రం రూమర్స్ అనేవి సోషల్ మీడియాలో రావడం కామన్ అని టాక్ ఇప్పుడు వినిపిస్తుంది.