టాలీవుడ్ లో మొదటిసారి నటనతో అడుగుపెట్టిన ఉప్పెన భామ ఒక్క చూపుతోనే అందరిని తన మాయలో పడేసింది.తన అందంతో యువత హృదయాలను గెలుచుకున్న ముద్దుగుమ్మ కృతి శెట్టి.
సినిమా విడుదల కాకముందే ఈ అమ్మడుకు ఆఫర్లు బాగా జోరందుకుంటున్నాయి.ఇక ఉప్పెన సినిమా విడుదల తర్వాత ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ హీరోయిన్ లను మించుపోతుందని అర్థమవుతుంది.
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తొలిసారిగా వెండితెరకు ఉప్పెన సినిమాతో పరిచయం కానున్నాడు.ఇక కృతి శెట్టి కూడా ఈ సినిమాతోనే తొలిసారిగా అడుగుపెట్టనుంది.
కృతి శెట్టి మోడలింగ్ లో ఎక్కువ ఆసక్తి చూపించేదట.అంతేకాకుండా చిన్న చిన్న ప్రకటనలను కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ.
ఈ విధంగా కృతి శెట్టి నటించిన ఉప్పెన సినిమా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కనుంది.ఇక ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది.
ఈ విధంగా కృతి శెట్టి మంగళవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ.కొన్ని విషయాలు అభిమానులతో పంచుకుంది.తనకు నటనపై ఆసక్తి ఉన్న సినిమాలను ఎంచుకుంటానని ఏ రోజు అనుకోలేదట.తాను చదువుకుంటున్న సమయంలోనే కొన్ని ప్రకటనలు నటించిందనే విషయాన్ని తెలిపింది.
వాటి ద్వారా ఉప్పెన సినిమాలో నటించే అవకాశం వచ్చింది అంటూ.బుచ్చిబాబు ఈ సినిమా కథ గురించి వినిపించగానే కన్నీళ్లు వచ్చాయని తెలిపింది.
2002 బ్యాక్ డ్రాప్ లో స్వచ్ఛమైన ప్రేమకథతో వెండితెరపై రానున్నదని, తాను ఇందులో బేబమ్మ అనే పాత్రలో నటించిందట.నిజ జీవితంలో తనకు అలాంటి పరిస్థితులు ఎదురైతే ఎలా ఉంటుందో ఊహించుకొని ఆ విధంగా సినిమా పాత్రల్లో నటించిందట.తన లైఫ్ లో కొన్ని అంశాలు ఈ పాత్రకు దగ్గరగా ఉందని తెలిపింది.అంతేకాకుండా ఈ సినిమాకు సుకుమార్ ఇచ్చిన ధైర్యమే నడిపించింది అంటూ తెలిపింది.
ఏ నటులైన సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ వంటి నిపుణులతో చేయాలనుకుంటారు.కానీ తనకు వీరిద్దరి కాంబినేషన్ లో తొలిసారిగా నటించే అవకాశం అదృష్టం అని తెలిపింది.
తాను నటన పట్ల ఎలాంటి శిక్షణ తీసుకోలేదంటూ.కేవలం దర్శకుడు బుచ్చిబాబు అందించిన సహకారంతోనే ఈ సినిమాను పూర్తి చేశానని తెలిపింది.
ప్రస్తుతం నానితో శ్యామ్ సింగ్ రాయ్ సినిమాలో నటిస్తున్నట్లు తెలిపింది.అంతేకాకుండా సుధీర్ బాబుతో మరో సినిమాలో చేస్తున్నానని తెలిపింది.