ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి మార్కులు వేయించుకున్న అందాల భామ కృతి శెట్టి.ఈ అమ్మడు అందానికి ఫిదా అయిన మన దర్శక, నిర్మాతలు ఉప్పెన రిలీజ్ కాకుండా కృతి శెట్టికి అవకాశాలు ఇచ్చారు.
ఈ నేపధ్యంలో నానికి జోడీగా శ్యామ్ సింగరాయ్, సుదీర్ బాబుకి జోడీగా లవ్ స్టొరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.అలాగే లింగుస్వామి దర్శకత్వంలో రామ్ కి జోడీగా ఈ అమ్మడుని ఫైనల్ చేశారు.
ఇలా వరుసగా మూడు క్రేజీ ప్రాజెక్ట్ లు కృతి శెట్టి చేతిలో ఉన్నాయి.ఈ మూడు సినిమాల మీద అంచనాలు భాగానే ఉంటాయి.
ఉప్పెన క్రేజ్ నేపధ్యంలో కృతి శెట్టికి 50 లక్షల వరకు రెమ్యునరేషన్ అందుతుందని టాక్ వినిపిస్తుంది.ఇదిలా ఉంటే నెక్స్ట్ చేయబోయే సినిమాలకి ఈ అమ్మడు కోటి రూపాయిల వరకు డిమాండ్ చేస్తుందని బోగట్టా.
అయితే కృతి శెట్టి వయస్సు ప్రస్తుతం 17 ఏళ్ళు మాత్రమే.ఈ నేపధ్యంలో ఆమెలో ఇంకా చిన్న పిల్లల మనస్తత్వం పోలేదనే టాక్ ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తుంది.
హీరోయిన్ అయిన తర్వాత దర్శక, నిర్మాతల దగ్గర కాస్తా యాటిట్యూడ్ చూపిస్తుంది అనే మాట వినిపిస్తుంది.అయితే కృతి సినిమాల ఎంపిక, రెమ్యునరేషన్, కాల్ షీట్స్ అన్ని కూడా ఆమె తండ్రి దగ్గరుండి చూసుకుంటున్నారని టాక్ నడుస్తుంది.
వయస్సు రీత్యా ఆమెలో ఉన్న చిన్నపిల్లల ఆలోచన కారణంగా దర్శక, నిర్మాతలు కొంత ఇబ్బంది పడుతున్న అయితే అది మరీ ఆమె కెరియర్ మీద ప్రభావం చూపించే స్థాయిలో లేదనే మాట వినిపిస్తుంది.