ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ కృతి శెట్టికి ఇప్పుడు టాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తున్నాయి.అమ్మడు అందానికి ఫిదా అయిపోయిన టాలీవుడ్ దర్శక, నిర్మాతలు అందరూ కృతి వెంట పడుతున్నారు.
రష్మిక, పూజా హెగ్డే తర్వాత టాలీవుడ్ లో ప్రస్తుతం కృతి శెట్టి మోస్ట్ క్రేజియస్ట్ హీరోయిన్ గా ఉంది.యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు అందరూ ఈ అమ్మడితో ఆడిపాడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఇప్పటికే కృతి శెట్టిని ముగ్గురు హీరోలు తమ సినిమాలలో ఫైనల్ చేయించుకున్నారు.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు మరో క్రేజీ ప్రాజెక్ట్ లో భాగం కాబోతున్నట్లు తెలుస్తుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత రాజమౌళితో చేయాల్సి ఉంది.
అయితే రాజమౌళి సినిమా మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉండటంతో ఈ లోపు మరో సినిమా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేసుకున్నాడు.ఈ నేపధ్యంలో సరిలేరు నీకెవ్వరూ సినిమాతో తనకి సాలిడ్ సక్సెస్ ఫుల్ ఎంటర్టైనర్ అందించిన అనిల్ రావిపూడితో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.ఎఫ్3 షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళే పనిలో ఉన్నారు.ఇప్పటికే స్టొరీ కూడా ఫైనల్ అయినట్లు తెలుస్తుంది.
ఈ సినిమా కోసం హీరోయిన్ గా కృతి శెట్టిని కన్ఫర్మ్ చేసే పనిలో అనిల్ రావిపూడి ఉన్నట్లు తెలుస్తుంది.మహేష్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వస్తే కృతిశెట్టిని ఖరారు చేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది.