టాలీవుడ్ లో హీరోయిన్స్ విషయంలో ఎప్పుడూ కూడా ఒక ట్రెండ్ నడుస్తూ ఉంటుంది.ప్రతి ఐదేళ్ళకి ఒకసారి స్టార్ హీరోయిన్స్ రేస్ లోకి కొత్త అమ్మాయిలు వచ్చి చేరుతూ ఉంటారు.
గత పదేళ్ళ కాలంలో కాజల్ అగర్వాల్, సమంత, తమన్నా స్టార్ హీరోయిన్స్ గా చలామణి అయ్యారు.వారి తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ ఓ ఐదేళ్ళ పాటు తన హవా కొనసాగించింది.
ఇక ప్రస్తుతం చూసుకుంటే కీర్తి సురేష్, పూజా హెగ్డే, రష్మిక మందన స్టార్ హీరోయిన్ పొజిషన్ లో ఉన్నారు.ఈ ముగ్గురు భామలు స్టార్ హీరోలతో జత కడుతూ వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు.
ఇదిలా ఉంటే నెక్స్ట్ స్టార్ హీరోయిన్ రేస్ లోకి ఓ ఇద్దరు హీరోయిన్స్ దూసుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు.ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న అందాల భామ కృతి శెట్టి.
ఈ అమ్మడు ఉప్పెన రిలీజ్ కి ముందే ఏకంగా మూడు రెండు సినిమాలలో అవకాశం పట్టేసింది.ఉప్పెన రిలీజ్ తర్వాత రామ్ సినిమాలో ఛాన్స్ పట్టేసింది.
ప్రస్తుతం మహేష్ బాబు సినిమా కోసం ఈమె పేరు వినిపిస్తుంది.
అలాగే ఆకాష్ పూరీకి జోడీగా రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న అందాల భామ కేతిక శర్మ.
ఈ సినిమా రిలీజ్ కాకుండానే ఈ భామ నాగ శౌర్యకి జోడీగా ఒక సినిమాలో ఛాన్స్ పట్టేసింది.ఇక ఇప్పుడు ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్ కి జోడీగా కొత్త సినిమాని కూడా స్టార్ట్ చేసేసింది.
ఈ సినిమా ఓపెనింగ్ తాజాగా జరిగింది.ఇదిలా ఉంటే ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమా కోసం కేతిక శర్మ పేరుని పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ అమ్మడు కూడా మొదటి సినిమా రిలీజ్ కాకుండా టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటుంది.అవన్నీ కూడా మంచి బజ్ ఉన్న సినిమాలే కావడంతో ఈ భామ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
ముఖ్యంగా కుర్ర హీరోలు ఎక్కువగా కృతి శెట్టి, కేతిక శర్మలతో రొమాన్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.ఈ నేపధ్యంలో నెక్స్ట్ టాలీవుడ్ లో ఈ భామలే స్టార్ హీరోయిన్స్ రేస్ లోకి వస్తారనే టాక్ వినిపిస్తుంది.