కరోనా రాకుండా కృష్ణపట్నం ఆనందయ్య ఇస్తున్న మందుపై ప్రచారం ఓ రేంజ్ లో జరిగింది.ప్రభుత్వం కూడా మందుకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆనందయ్య మందుపై ప్రజల ఆసక్తి మరింత పెరిగింది.
ఎన్నో వివాదాలు.అనుమానాల మధ్య ఆనందయ్య మందు పంపిణీ మళ్లీ మొదలైంది.
అయితే ఆనందయ్య మందు పంపిణీపై ప్రభుత్వ నిబంధనలు కంపల్సరీ అంటున్నారు.సోమవారం రోజు కేవలం 2వేల మందికే మందు పంపిణీ చేసేందుకు సిద్ధం అవుతున్నరు.
కృష్ణపట్నం, సర్వేపల్లి చంద్రగిరి ఏరియాల్లో ఈ మందు పంపిణీ జరుగుతుందని తెలుస్తుంది.కృష్ణపట్నంలో ఆనందయ్య తమ్ముడు నాగరాజు మందు తయారు చేసి పంపిణీ చేస్తున్నారు.
సర్వేపల్లిలో ఆనందయ్య.చంద్రగిరిలో తనయుడు శ్రీధర్ మందు పంపిణీ చేయనున్నారు.
అమెరికాలో ఉంటున్న ఆనందయ్య చిన్న కుమార్డు కూడా మందు విస్తరణపై దృష్టి పెట్టాడని తెలుస్తుంది.ఆనందయ్య మందు కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే పరిమిత సంఖ్యలో మందు పంపిణీ జరుగుతుందని తెలుస్తుంది.రోజుకి కనీసం 5వేల మందికి మందు పంపిణీ చేస్తారని ప్రచారం జర్గినా కేవలం 2 వేల మందికే మందు ఇస్తారని తెలుస్తుంది.
కృష్ణపట్నంలో ప్రస్తుతం 144 సెక్షన్ అమలులో ఉంది.ఆధార్ కార్డ్ పరిశీలించి గ్రామంలోని వారికి మందు ఇస్తారు.
వాలంటీర్ల ద్వారా నియఓగక వర్గంలోని ప్ర్తి ఇంటికి మెడిసిన్ అందేలా చేస్తున్నారు.మందు పంపిణీ ముందుగా సర్వేపల్లిలో మొదలవుతుదని తెలుస్తుంది.