క్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ ప్రస్తుతం రంగమార్తాండ సినిమా చేస్తున్నారు.ఆ సినిమా త్వరలో పూర్తి చేస్తారని తెలుస్తుంది.
ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే కృష్ణవంశీ అన్నం సినిమా ఎనౌన్స్ చేశాడు.అన్నం సినిమా పోస్టర్ తో అందరికి షాక్ ఇచ్చాడు కృష్ణ వంశీ.
అన్నం కథ అందరిని ఆలోచింపచేసేలా ఉంటుందని అన్నారు.
ఈమధ్య ఫాం లో లేని కృష్ణవంశీ సినిమా అనగానే నిర్మాతలు అంతకుముందు చూపించిన ఆసక్తి చూపించట్లేదు.
నిజంగానే ఆయన ఓ అద్భుతమైన కథని రాసుకున్నా సరే నిర్మాతలు సాహసం చేయట్లేదు.అయితే అన్నం సినిమా మాత్రం ఖచ్చితంగా అందరిని ఆలోచించేలా చేస్తుందని అంటున్నారు.కృష్ణవంశీ ఈ సినిమాతో మళ్లీ తన సత్తా చాటుతారని అంటున్నారు.
అసలైతే రంగమార్తాండ కి ముందే బాలకృష్ణతో రైతు సినిమా అనుకున్నారు కృష్ణవంశీ.
అయితే ఆ సినిమాలో అమితాబ్ నటిస్తేనే ఆ సినిమా చేస్తానని ఆయన చెప్పడంతో కృష్ణవంశీ ఆ ప్రయత్నాలు చేసి వెనక్కి తగ్గారు.ఆ రైతు కథనే అన్నం అనే టైటిల్ తో చేస్తున్నారని తెలుస్తుంది.
అయితే అన్నం పోస్టర్ మాత్రమే వదిలిన కృష్ణవంశీ అందులో నటించే కాస్ట్ అండ్ క్రూ గురించి మాత్రం ఏమి వెల్లడించలేదు.
అన్నం సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ తో మ్యూజిక్ చేయించాలని మాత్రం అనుకున్నారు.ఈ సినిమా బడ్జెట్ కూడా భారీగానే ఉండబోతుందట.అయితే రంగమార్తాండ బయటకు వచ్చాక అన్నం సినిమా ముందుకు సాగే అవకాశం ఉంటుంది.రంగమార్తాండ హిట్ అయితే మాత్రం అన్నం మీద అంచనాలు పెరిగే ఛాన్స్ ఉంటుంది. రంగమార్తాండ సినిమాతో మరోసారి తన స్టామినా ప్రూవ్ చేయాలని అనుకుంటున్నారు కృష్ణవంశీ.
ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం వంటి స్టార్స్ నటిస్తున్న ఈ సినిమా టీజర్ త్వరలో రిలీజ్ చేయనున్నారు. రంగమార్తాండ హిట్ పడితే మాత్రం కృష్ణవంశీ మళ్లీ వరుస సినిమాలు చేసే అవకాశం ఉంటుంది.