కృష్ణ అల్లుడు సుధీర్బాబు ఇటీవలే ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పర్వాలేదు అనిపించుకున్నాడు.సుధీర్బాబు ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమాకు ముందు ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని’ సినిమాను చేశాడు.
‘ప్రేమకథాచిత్రమ్’లో తనకు జోడీగా నటించిన నందితతో కలిసి ఈ సినిమాను చేశాడు.ప్రేమికుల రోజు శుభాకాంక్షలతో ఫిబ్రవరి 14న ఈ సినిమాను విడుదల చేయాలని భావించారు.
అయితే అనుకోని కారణాల వల్ల వాయిదా వేశారు.అప్పటి నుండి ఇప్పటి వరకు మళ్లీ మళ్లీ వాయిదా పడుతూ వచ్చింది.
ఎట్టకేలకు ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది.తాజాగా చిత్ర యూనిట్ ఈనెల 19న సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ప్రకటించారు.
చంద్రు దర్శకత్వంలో ఈ సినిమాను లగడపాటి శ్రీధర్ నిర్మించాడు.ఈ సినిమా ట్రైలర్స్ మరియు ఫొటోలు చూస్తుంటే సినిమాపై ఆసక్తి కలుగుతోంది.
ఈ సినిమాలో మూడు విభిన్న పాత్రల్లో సుధీర్బాబు కనిపిస్తాడని అంటున్నారు.ఇక రానా, నాగచైతన్యలు గెస్ట్లుగా ఈ సినిమాలో కనిపించనున్నారు.
మహేష్బాబు కూడా ఆశ్చర్యపర్చుతూ ఈ సినిమాలో ఇలా వచ్చి అలా వెళ్తాడు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.