ప్రస్తుత తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా ఉన్న ఈఎస్ఎల్ నరసింహన్ స్థానంలో కొత్తగా మరొకరికి స్థానం కల్పించే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం కొత్తగా … ఓ కొత్త పేరు తెరమీదకు తీసుకొచ్చింది.
ప్రస్తుత గవర్నర్ నరసింహన్ ను తెలంగాణకు పరిమితం చేసి ఏపీకి కొత్తగా గవర్నర్ ను నియమించాలని చూపిస్తోంది.ఈ నేపథ్యంలో … సమర్ధుడైన తెలుగు వ్యక్తి కోసం కేంద్రం వెతుకులాట ప్రారంభించింది.
ఈ నేపథ్యంలోనే… మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు పేరును తెరమీదకు తీసుకొస్తున్నారు కేంద్ర ప్రభుత్వ పెద్దలు.ఈమేరకు చర్చల కోసం ఢిల్లీకి రమ్మంటూ కృష్ణంరాజుకు పిలుపు వచ్చినట్టు సమాచారం.
అయితే ఇక్కడే కేంద్ర బీజేపీ పెద్దలు పెద్ద మెలిక పెట్టినట్టు తెలుస్తోంది.మీకు గవర్నర్ పదవి ఇస్తాము కానీ బీజేపీలోకి ప్రభాస్ ను తీసుకురావాలి అంటూ… మెలిక పెట్టినట్టు తెలుస్తోంది.ప్రభాస్ కనుక బీజేపీలోకి వస్తే… ఆయనకు ఎమ్యెల్యే టికెట్… మీకు గవర్నర్ పదవి కేటాయిస్తామంటూ… ఆఫర్ ఇచ్చారట.