ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.మూడు సినిమాలు ప్రస్తుతం సెట్స్ పై ఉన్నాయి.
అందులో ఒకటి మూడు సంవత్సరాలుగా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది.అదే రాధే శ్యామ్.
ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా ను కృష్ణం రాజు సహ నిర్మాతగా ఉండటంతో పాటు సినిమా లో కీలక పాత్రను ఆయన చేస్తున్నాడు.రాధే శ్యామ్ లో కృష్ణం రాజు పాత్ర అత్యంత కీలకంగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
రాధే శ్యామ్ లోని సీనియర్ రెబల్ స్టార్ కృష్ణం రాజు పాత్ర షూటింగ్ ముగిసింది.షూటింగ్ ను ఇటీవలే పునః ప్రారంభించినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు పేర్కొన్నారు.కృష్ణం రాజు నాలుగు రోజుల షెడ్యూల్ ను ముగించుకున్నాడట.
కృష్ణం రాజు షెడ్యూల్ ముగించడంతో ఇక మిగిలింది ప్రభాస్ పూర్తి చేయాల్సి ఉంది.
మరి కొన్ని రోజుల్లో నే ఈ సినిమా కు గుమ్మడి కాయ కొట్టే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా షూటింగ్ ను హైదరాబాద్ లోనే చివరి దశ చేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.
జులై లో ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నా కూడా కరోనా సెకండ్ వేవ్ వల్ల సాధ్యం కాలేదు.ఇక ఈ సినిమా కొత్త విడుదల తేదీపై ప్రచారం మొదలు అయ్యింది.
ఎప్పుడు ఈ సినిమా ను పట్టాలెక్కించారో కాని అనేక అడ్డంకులు తప్పడం లేదు.ఈ సినిమా కొత్త విడుదల తేది విషయంలో ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.దసరాకు అంటూ ప్రచారం మొదలు అయ్యింది కాని అసలు విషయం ఏంటీ అనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.