పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.వాటిల్లో రాధేశ్యామ్ ఒకటి.
రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.ప్రభాస్ ను వెండి తెర మీద చూడక దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది.
అందుకే రాధేశ్యామ్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఎట్టకేలకు అన్ని అడ్డంకులను దాటుకుని ఈ సినిమా మార్చి 11న రిలీజ్ కాబోతుంది.
ఇప్పటికే ఈ సినిమా నుండి ప్రమోషన్స్ పరంగా వచ్చిన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకులకు ఈ సినిమాను మరింత దగ్గర చేసింది.ఇక ఇప్పుడు వరుస ఇంటర్వ్యూలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు మేకర్స్.
ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో ప్రమోషన్స్ కూడా అదే స్థాయిలో చేస్తున్నారు.
ఈ ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్ తన సెంటిమెంట్ గురించి కూడా చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.‘సత్యరాజ్ సార్ నా లక్కీ మస్కట్ నేను ఆయనతో కలిసి చేసిన మిర్చి, బాహుబలి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.రాధేశ్యామ్ కూడా మా కెరీర్ లో మరొక మైలురాయిలా నిలిచి పోతుంది.
అని చెప్పిన విషయం తెలిసిందే.సత్యరాజ్ చేసిన పాత్రను తెలుగులో ప్రభాస్ పెద్ద నాన్న కృష్ణం రాజు చేసారు.
ప్రభాస్ గతంలో కూడా ఆయన పెద్ద నాన్న కృష్ణం రాజు తో స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే.అయితే ఈయనతో చేసిన బిల్లా, రెబల్ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను నిరాశ పరిచాయి.బిల్లా అయినా పర్వాలేదు కానీ రెబల్ మాత్రం అట్టర్ ప్లాప్ అయ్యింది.ఇక ఇప్పుడు వీరిద్దరూ కలిసి రాధేశ్యామ్ సినిమాలో నటించారు.మరి ఈ సినిమాతో అయినా సక్సెస్ కొట్టి వీరి ప్లాప్ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తారో లేదో చూడాలి.మరొక నాలుగు రోజులు వేచి ఉంటే ఈ విషయంపై క్లారిటీ వచేస్తుంది.