బీజేపీ సీనియర్ నాయకుడు, సినీనటుడు ప్రముఖ హీరో ప్రభాస్ పెదనాన్న ఉప్పలపాటి కృష్ణంరాజు నిన్న రాత్రి అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.దీంతో హుటాహుటిన ఆయనను బంజారాహిల్స్ లో ఉన్న కేర్ ఆసుపత్రికి సిబ్బంది తరలించారు.
కృష్ణంరాజు గత కొంతకాలంగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఆయన కొంతకాలంగా న్యూమోనియా వ్యాధితో బాధపడుతున్నారు.
అకస్మాత్తుగా వాతావరణం మారడంతో ఆయనకు శ్వాసకు సంబందించిన ఇబ్బందులు ఏర్పడి అస్వస్థతకు గురయ్యారు.ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగ్గానే ఉన్నట్టుగా ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.
కృష్ణంరాజు ఆరోగ్య పరిస్థితి కాస్త కుదుటిపడిన తరువాత ఆయన్ను జనరల్ వార్డ్ కు డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.ప్రస్తుతానికి శ్వాస సక్రమంగానే తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
కృష్ణంరాజు ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు పాలిటిక్స్ లోనూ కొనసాగుతున్నారు.బీజేపీలో సీనియర్ నాయకుడిగా ఉండడంతో ఆయన చాలా కాలంగా గవర్నర్ పదవి మీద ఆశలు పెట్టుకున్నారు.
అయితే బీజేపీ అధిష్టానం ఆయనకు ఆ ఛాన్స్ ఇవ్వకపోవడంతో బీజేపీపై ఆయన అసంతృప్తిగా ఉన్నారు.ప్రస్తుతం కృష్ణంరాజు వయస్సు 79 సంవత్సరాలు.