ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయవాడలో కృష్ణలంక రిటైనింగ్ వాల్ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు.జగన్ చేతుల మీదుగా జరిగిన ఈ శంకుస్థాపన కార్యక్రమానికి కృష్ణా జిల్లా మరియు గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ పార్టీ నేతలు, మంత్రులు హాజరయ్యారు.
ఈ రిటైనింగ్ వాల్ తో కృష్ణలంక వాసులకు వరద కష్టాలు తీరనున్నాయి.దాదాపు 125 కోట్ల రూపాయల వ్యయంతో ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం జరగనుంది.
ఈ నేపథ్యంలో అక్కడ ఇంజనీర్లు చేపట్టబోయే పనుల వివరాలను ముఖ్యమంత్రి జగన్ కు వివరించారు.అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలలో విజయవాడ నగరానికి చెందిన గెలిచిన కీలక నేతలు కూడా హాజరయ్యారు.
చాలా సందర్భాలలో వరదలు వచ్చిన సమయంలో కృష్ణలంక వాసులు అనేక అవస్థలు పడటంతో ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని అతి తక్కువ టైమ్ లోనే కంప్లీట్ చేయాలని డిసైడ్ అయింది.వచ్చే వర్షాకాలం నాటికి ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు పూర్తి కానున్నట్లు సమాచారం.