తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడు కృష్ణవంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన గులాబీ, ఖడ్గం, అంతఃపురం, నిన్నే పెళ్ళాడుతా వంటి చిత్రాలు ఎంతో అద్భుతమైన విజయాలను అందుకున్నాయి.
కృష్ణవంశీ దర్శకత్వం వహించిన సినిమాలకు జాతీయ చలనచిత్ర అవార్డుల తో పాటు ఫిలింఫేర్ అవార్డులు నంది అవార్డును కూడా అందుకున్నారు.ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి దర్శకుడిగా గుర్తింపు పొందిన కృష్ణవంశీ గత కొన్ని సంవత్సరాల నుంచి ఏ ఒక్క విజయాన్ని అందుకోలేక పోతున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా బ్రహ్మానందం రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నటువంటి రంగమార్తాండ అనే చిత్రం ద్వారా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం పదిరోజులలో షూటింగ్ పనులు పూర్తి అవుతాయని త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు కృష్ణవంశీ తెలిపారు.
ఇక ఈ సందర్భంగా కృష్ణవంశీ మాట్లాడుతూ తనకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాగార్జున అంటే ఎంతో ఇష్టమని తెలియజేశారు.
అలాగే తన దర్శకత్వం చిరంజీవి రెండు మూడు సినిమాలు చేయాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమాలను చేయలేకపోయారు.
ఎలాగైనా చిరంజీవితో ఒక్క సినిమా అయినా చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.ప్రస్తుతం చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే కృష్ణవంశీ దర్శకత్వంలో మెగా స్టార్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? అతని కోరికను నెరవేరుస్తారా? అనేది తెలియాల్సి ఉంది.ఇక రంగమార్తాండ సినిమా విషయానికి వస్తే ఇందులో రమ్యకృష్ణ బ్రహ్మానందంలో ఉన్న కొత్త కోణాన్ని చూస్తారని,ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని ఈ సందర్భంగా కృష్ణవంశీ రంగమార్తాండ సినిమా గురించి వెల్లడించారు.