ఈ మధ్య సినిమా తారలు అందరూ.ప్రముఖ ఆటగాళ్లతో ప్రేమలో పడుతున్నారు.
మరో బాలీవుడ్ నటి అనుష్క, ప్రముఖ క్రికెటర్ ఆటగాడు విరాట్ కోహ్లీ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.కాగా మరో బాలీవుడ్ నటి తన బాయ్ ఫ్రెండ్ కు జరిగిన గాయాలతో తట్టుకోలేక పరిగెత్తుకొచ్చిన దృశ్యం అందర్నీ ఆకట్టుకుంది.
బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ దిశా పటానీ గురించి అందరికీ తెలిసిందే.తన నటనతో మంచి గుర్తింపు పొందిన ఈ బాలీవుడ్ నటి కి మరో యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ తో ప్రేమాయణం ఉందని బాలీవుడ్ లో మొత్తం తెగ వార్తలు వినిపించాయి.
అంతే కాకుండా వీరిద్దరూ కలిసి బయట తిరగడం వంటివి కూడా బాగా వినిపించాయి.తాజాగా టైగర్ ష్రాఫ్ ముంబై లో ఫుట్ బాల్ఆ డుతున్న మైదానానికి వెళ్లగా.
అతనితో పాటు తన ప్రియురాలు దిశా పటానీ కూడా ఆ మైదానానికి వెళ్ళింది.
ఇక కాసేపు తన ప్రియుడు టైగర్ ష్రాఫ్ తో కలిసి ఫుట్ బాల్ ఆడింది.ఆ తర్వాత అక్కడినుంచి వెళ్లి మరో చోట కూర్చొని తన ప్రియుడు ఆడుతున్న ఆటను చూస్తూ ఎంజాయ్ చేసింది.ఇక ఎంతో సరదాగా ఆడుతున్న సమయంలో టైగర్ ష్రాఫ్ ఉన్నట్టుండి అక్కడే మైదానంలో కిందపడిపోయాడు.
దీంతో అక్కడున్న సిబ్బంది ఆయన దగ్గరకు చేరుకొని తనకు మెడికల్ ట్రీట్మెంట్ ను అందించారు.ఇది చూసిన తన ప్రియురాలు దిశా పటానీ తన ప్రియుడికి ఏమైందో అన్నట్టు కంగారుతో అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది.
దీంతో ఆయన స్వల్ప గాయాలపాలై ఉన్న తన ప్రియుడికి అండగా ఉండి చికిత్స చేయించింది.ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.తను తన ప్రియుడి దగ్గరగా ఉండి చికిత్స చేయించినందుకు టైగర్ ష్రాఫ్ సోదరి కృష్ణ ష్రాప్ దిశా పటానీ కు అభినందనలు తెలిపింది.