టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్తను ఇప్పటికీ చిత్ర పరిశ్రమ మహేష్ బాబు కుటుంబ సభ్యులు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.ఏడాదిలో మహేష్ బాబు కుటుంబంలో తన తల్లిదండ్రులతో పాటు అన్నయ్య కూడా మరణించడంతో మహేష్ బాబు ఎంతో మనోవేదనకు గురయ్యారు.
ఇలా దెబ్బ పై దెబ్బ పడటంతో మహేష్ తీవ్రంగా కృంగిపోయారు.ఈ క్రమంలోనే ఆయనకు మనో ధైర్యం కల్పించాలని అభిమానులు దేవుడిని ప్రార్థిస్తున్నారు.
ఇకపోతే కృష్ణ మరణం తర్వాత మహేష్ బాబు ఆయనకు చేయాల్సినటువంటి కార్యక్రమాలు అన్నింటిని చేస్తున్నారు.ఈ క్రమంలోనే నవంబర్ 27వ తేదీ హైదరాబాదులో కృష్ణ దశదినకర్మ నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి సినిమా సెలబ్రిటీలతో పాటు అభిమానులు కూడా పెద్ద ఎత్తున హాజరుకానున్నట్లు సమాచారం.ఇకపోతే కృష్ణ దశదిన కర్మ కోసం ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయడం విశేషం ఈ క్రమంలోనే కృష్ణ 27 సంవత్సరాలు వయసులో ఉన్నటువంటి పోలికలతో అచ్చం జీవకల ఉట్టిపడేలా విగ్రహాన్ని తయారు చేశారు ప్రస్తుతం ఈ విగ్రహం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రముఖ శిల్పి రాజ్కుమార్ వడయార్.అంబెడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో సూపర్ స్టార్ విగ్రహాన్ని తయారు చేశారు.కుటుంబ సభ్యుల కోరిక మేరకే ఈ విగ్రహాన్ని తయారు చేసినట్లు తెలియజేశారు.అయితే ఈయన కేవలం రెండు రోజులలోనే ఎంతో అద్భుతంగా ఈ విగ్రహాన్ని తయారు చేశారు.
ఇకపోతే ఎంతోమంది అభిమానులు కృష్ణ గారి విగ్రహాన్ని పలు నగరాలలో ఏర్పాటు చేయడం కోసం పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇస్తున్నారని ముఖ్యంగా ఆయన నటించిన సినిమాలలో పాత్రలలో తన విగ్రహాలను ఆర్డర్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.ఎక్కువగా కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆర్డర్ ఇచ్చినట్టు సమాచారం.
ఇక ఇప్పటికే కొత్తపేట నుంచి ఈ విగ్రహాలను హైదరాబాదుకు తరలించినట్లు తెలుస్తోంది.