సమాజంలో జరుగుతున్న కొన్ని ఘటనలను చూస్తుంటే నేడు యువత ఎటువైపు ప్రయాణిస్తుందనే అనుమానం వస్తుంది.పూర్తిగా జల్సాలకు అలవాటు పడిన యువకులు ఆ మత్తులో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నామన్న విషయాన్ని మరచిపోతున్నారు.
ఇందులో తల్లిదండ్రుల పెంపకంలో లోపం ఉందా? లేక ఈనాటి పిల్లల ఆలోచనల్లో తేడా ఉందా? తెలియడం లేదు.మొత్తానికి మరణ శిక్షలు, ఎన్కౌంటర్లు ఎవరిలో మార్పు తేవడం లేదు.
ఇకపోతే ఓ 18 సంవత్సరాల యువకుడు ఎనిమిది సంవత్సరాల వయసున్న అభం శుభం తెలియని బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన కృష్ణాజిల్లాలో చోటు చేసుకుంది.ఆ వివరాలు చూస్తే.
కృష్ణాజిల్లా, పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలం, నీళ్ళ పూడి గ్రామంలో ఎనిమిదేళ్ల బాలికపై 18 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
అనంతరం తీవ్ర రక్తస్రావంతో ఆ బాలిక ఏడుస్తూ తన తల్లి దగ్గరకు వెళ్లి జరిగింది చెప్పగా వెంటనే బాధితురాలి కుటుంబ సభ్యులు కృత్తివెన్ను పోలీసులను ఆశ్రయించారు.ఇక కేసు నమోదు చేసిన పోలీసులు, బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.