ఇంతకాలం కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయం హైదరాబాద్లోని జలసౌధ భవన సముదాయం లో ఉన్న విషయం తెలిసిందే.అయితే ఈ కృష్ణా బోర్డును ఏపీకి తరలించాలనే ప్రతిపాదన ఎప్పటి నుండో ఉంది.
దాదాపు రెండు నెలలుగా కసరత్తు జరుగుతున్నా ఇప్పటికీ భవనాల ఎంపిక ఓ కొలిక్కి రాలేదు.
ఈ నేపధ్యంలో తాజాగా కృష్ణా బోర్డు విషయంలో స్పందించిన ప్రభుత్వం ఇందులో భాగంగా సరైన భవనాలను పరిశీలించేందుకు ప్రత్యేక బృందం ఏప్రిల్ మొదటి వారంలో విశాఖపట్నం వెళ్లనున్నట్లు సమాచారం.
ఇకపోతే ఈ ప్రతిపాదనను గతేడాది అక్టోబరులో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించి ఆమోదం తెలిపాయి.ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం లో బోర్డు హెడ్ క్వార్టర్ను ఏర్పాటు చేయనున్నట్లు బోర్డు యాజమాన్యానికి స్పష్టం చేసింది.
కాగా సరైన సౌకర్యాలున్న భవనాలను ఎంపిక చేసే ప్రక్రియ ఏప్రిల్ మొదటి వారంలో పూర్తికానున్నట్లుగా సమాచారం.