విధి రాతను ఎవరు తప్పించగలరు చెప్పండి.ఒక వ్యక్తి హీరో అవ్వాలన్నా, విలన్ అవ్వాలన్నా, స్టార్ హీరో అవ్వాలన్న టాలెంట్ తో పాటు కాస్త అదృష్టం ఉండాల్సిందే.
ఈ విషయం సూపర్ స్టార్ కృష్ణ ను చూస్తే ఖచ్చితంగా నిజం అని ఒప్పుకోక తప్పదు.ఎందుకంటే మొదట్లో ఆయనను ఎవరు పట్టించుకోలేదు.
తేనె మనసులు అనే సినిమా లో కృష్ణ తోపాటు రామ్మోహన్ రావు అనే నటుడు కూడా నటించాడు.ఈ చిత్రం రెండు జంటలపై నడిచే సినిమా కాబట్టి ఇద్దరికీ వాస్తవానికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి.
కానీ రామ్మోహన్ రావు చూడ్డానికి కాస్త పొట్టిగా, లావుగా ఉంటాడు.అంతే కాదు బాలీవుడ్ నటుడైన దేవానంద్ పోలికలు అతడికి అచ్చు గుద్దినట్టుగా ఉంటాయి.
అందుకే రామ్మోహన్ రావు బాగా క్లిక్ అయ్యాడు ఈ సినిమా తర్వాత.రామ్మోహన్ రావు కి జంటగా నటించినా సుకన్య కూడా బాగా క్లిక్ అయింది.
ఈ సినిమాను తీసిన ఆదుర్తి సుబ్బారావు కూడా అతను ఆంధ్ర దేవానంద్ అంటూ ఆకాశానికి ఎత్తి అతడికే ఎక్కువ శాతం సీన్స్ ఉండేలా చేశాడు.కృష్ణకు జోడిగా సంధ్య అనే ఒక ఆర్టిస్టు నటించింది.కృష్ణను సంధ్య నువ్వు ఇద్దరినీ ఎవ్వరూ పట్టించుకోలేదు.ఒక్క ముక్కలో చెప్పాలంటే కృష్ణ ఈ సినిమాకి సెకండ్ హీరో మాత్రమే.అలాగే కన్న మనసులు సినిమాలో సైతం కృష్ణ సెకండ్ హీరో నటించాడు.హీరోగా ఉన్న కృష్ణ విలన్ గా నటించడానికి ప్రైవేట్ మాస్టారు అనే సినిమా కోసం ఒప్పుకున్నాడు.
దిగ్గజాలు నటించిన ఈ చిత్రం ఫ్లాప్ అయింది.ప్రైవేట్ మాస్టారు సినిమాకు కె విశ్వ నాథ్ దర్శకత్వం అందించారు.
ఇక ఆదుర్తి సుబ్బారావు తేనెమనసులు, కన్నె మనసులు, ప్రైవేటు మాస్టారు వంటి సినిమాలకు రామ్మోహన్ రావు నీ బాగా ప్రోత్సహించిన ఆ తర్వాత తీసిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.ఆంధ్ర దేవానంద్ అనే పేరు మత్తులో పడిపోయి దాని నుంచి బయటకు రాలేక ఆ తర్వాత హీరో పాత్రలకు మాత్రమే ఒప్పుకోవడంతో మిగతా పాత్రలు కూడా రాకపోవడంతో కనబడకుండా పోయాడు.ప్రైవేట్ మాస్టర్ సినిమా ఫ్లాప్ అవ్వడం కృష్ణకు కలిసి వచ్చింది.లేదంటే కృష్ణంరాజుల అటు హీరో కాకుండా ఇటు విలన్ కాకుండా మిగిలేవాడు.ఆ తర్వాత గూడచారి 116 సినిమా కోసం కృష్ణ ను ఎంపిక చేశారు.ఆ సినిమా ఘనవిజయం సాధించడంతో కృష్ణ తిరుగులేని హీరోగా మారిపోయాడు.
ఇక రెస్ట్ ఈజ్ హిస్టరీ.