మెగా హీరో వైష్ణవ్ తేజ్ రెండవ సినిమా కొండ పొలం విడుదలకు సిద్దం అయ్యింది.ఈవారంలో విడుదల కాబోతున్న ఈ సినిమా కు లో ప్రమోషన్స్ చేస్తూ అంచనాలు పెంచకుండా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న సమయంలో సినిమా గురించిన చర్చ ఎక్కవ అవుతోంది.సినిమాపై అంచనాలు పెంచకుండా సింపుల్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా దర్శకుడు చేస్తున్న ప్రయత్నం అభినందనీయం.
ఇక ఈ సినిమా ను కొండ పొలం అనే నవల ఆధారంగా తీసుకు వస్తున్నారు.ఆ విషయంలో ఇప్పటికే క్లారిటీ ఉంది.
మరింత క్లారిటీ పదే పదే క్రిష్ చెబుతూనే ఉన్నాడు.ఇక ఈ సినిమా కు క్రిష్ దర్శకుడు కాగా మరో ఇద్దరు దర్శకులు ఈ సినిమా పట్టాలెక్కడానికి కారణం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
దర్శకుడు క్రిష్ ఇటీవల మాట్లాడుతూ నాకు దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి గారు కొండ పొలం బుక్ ను చదవమని రిఫర్ చేయడం జరిగింది.ఆయన చదవమని చెప్పడం వల్లే నేను బుక్ చదివేందుకు సిద్ద అయ్యాను అంటూ క్రిష్ పేర్కొన్నాడు.మరో దర్శకుడు సుకుమార్ కూడా ఆయన చెప్పిన విషయాన్ని సమర్థించారు.తప్పకుండా కొండ పొలం బుక్ చదవాలంటూ నాకు సూచించాడు.అలా నేను కొండ పొలం సినిమాను మొదలు పెట్టేందుకు వారు ఇద్దరు ప్రేరణగా నిలిచారు అంటూ ఈ సందర్బంగా దర్శకుడు క్రిష్ చెప్పాడు.సోషల్ మీడియాలో కొండ పొలం కథ ను చాలా మార్చారు అంటూ వార్తలు వస్తున్నాయి.
కాని నేను కథను సినిమాటిక్ గా తీసేందుకు స్క్రీన్ ప్లే ను కొత్తగా రాశాను తప్ప దాన్ని ఏం మార్చలేదు అంటూ తేల్చి చెప్పాడు.కొండ పొలం కథకు మంచి న్యాయం చేశాను అనే నమ్మకం ఉందని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.