సాధారణంగా సెలబ్రిటీలు తరుచూ సోషల్ మీడియా వేదికగా వారి సినిమాల గురించి ఎన్నో విషయాలను చర్చిస్తూ ఉంటారు.అంతేకానీ తమ వ్యక్తిగత విషయాల గురించి సెలబ్రెటీలు చర్చించడం చాలా అరుదు.
ఈ క్రమంలోనే సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలను తెలుసుకోవడానికి చాలా మంది అభిమానులు ఆరాటపడుతుంటారు.తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తన వ్యక్తిగత విషయాన్ని ఈ సందర్భంగా అభిమానులతో పంచుకున్నారు.
రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తెలుగులో క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ హీరోగా తెరకెక్కుతున్న “కొండపొలం” సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా అక్టోబర్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ క్రమంలోని ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా రకుల్ ప్రీత్ సింగ్ మీడియాతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా ఆమె కొండపొలం సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు.
ఈ సినిమా కథ చెప్పడానికి డైరెక్టర్ క్రిష్ తన ఇంటికి వచ్చిన సమయంలో రకుల్ టీ షర్ట్,షార్ట్ వేసుకుని ఉన్నానని ఆ సమయంలో నన్ను చూసిన క్రిష్ యంగ్ గా ఉన్నావ్.వైష్ణవ్ పక్కన యంగ్ గర్ల్ కావాలనుకున్న అలాగే ఉన్నావ్ అంటూ క్రిష్ ఇచ్చిన కాంప్లిమెంట్ గురించి తెలియజేసింది.ఈ క్రమంలోనే రకుల్ తనకు 30 సంవత్సరాలు వచ్చినప్పటికీ యంగ్ హీరోల సరసన నటించడానికి తాను యంగ్ గా ఉన్నానని పరోక్షంగా చెబుతోంది.
ఈ క్రమంలోనే వైష్ణవ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో నటించడం కోసం ఎంతో కష్టపడ్డానని,ఇందులో గొర్రెలు కాసే ఓబులమ్మ అనే గ్రామీణ యువతి పాత్రలో తను సందడి చేయనున్నట్లు తెలియజేశారు.