టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రతిభావంతులైన దర్శకులలో క్రిష్ ఒకరనే సంగతి తెలిసిందే.గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలను తెరకెక్కించిన క్రిష్ ప్రస్తుతం ఏ ఎం రత్నం నిర్మాతగా హరిహర వీరమల్లు అనే సినిమాను తెరకెక్కిస్తుండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో హీరోగా నటించనున్నారు.
నిన్న వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా క్రిష్ ఈ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరయ్యారు.
ఈ ఈవెంట్ లో క్రిష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తనకు వార్నింగ్ ఇచ్చారంటూ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు.
క్రిష్ మాట్లాడుతూ ఫ్యాన్స్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వేరని అన్నారు.ఒకరోజు పవన్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో ఈరోజు ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి పవన్ ను జాగ్రత్తగా చూసుకోవాలంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారని తెలిపారు.
వకీల్ సాబ్ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నానని క్రిష్ తెలిపారు.
ఇలాంటి కథల్లో నటించడానికి అంగీకరించినందుకు పవన్ కళ్యాణ్ గ్రేట్ అని క్రిష్ అన్నారు.పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ కథను నిర్మించినందుకు దిల్ రాజుకు ను క్రిష్ ప్రశంసించారు.మరోవైపు వచ్చే ఏడాది టార్గెట్ గా హరిహరవీరమల్లు తెరకెక్కుతోంది.
భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.నిర్మాత ఈ సినిమా కోసం దాదాపు 200 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది.
పవన్ వజ్రాల దొంగగా కనిపిస్తుండగా నిధి అగర్వాల్ పాత్రకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.క్రిష్ వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఒక సినిమాకు డైరెక్షన్ చేయగా కొద్ది నెలల గ్యాప్ లోనే ఈ సినిమా, హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుండటం గమనార్హం.
వచ్చే ఏడాది సంక్రాంతికి హరిహర వీరమల్లు రిలీజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.