టాలీవుడ్ విలక్షణ దర్శకుడు క్రిష్ హిందీలో రూపొందించిన మూవీ ‘మణికర్ణిక’.కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా వివాదాస్పదం అయ్యింది.
సినిమా ను మద్యలో క్రిష్ నుండి కంగనా టేకోవర్ చేసింది అంటూ వార్తలు వచ్చాయి.కంగనా మరియు క్రిష్ ల మద్య వచ్చిన విభేదాలే అందుకు కారణం అన్నారు.
ముఖ్యంగా ఒక పాత్రకు సంబంధించి కంగనా ఆసక్తి గా లేదని ఆ పాత్ర వల్ల తన పాత్ర డామినేట్ అవ్వడం లేదు అంటూ కంగనా ఆ పాత్రను ఫస్ట్ హాప్ లోనే తొలగించాలని కంగనా భావించింది.అందుకు క్రిష్ నో చెప్పడంతో నిర్మాత సహకారంతో కంగనా ఆ పని చేసింది.
తాజాగా సామ్ జామ్ టాక్ షో లో పాల్గొన్న క్రిష్ మణికర్ణిక వివాదంపై మరోసారి స్పందించాడు.
మణికర్ణిక సినిమాను అన్న పూర్ణ స్టూడియోలో ప్రారంభించడం జరిగింది.
సినిమాను 90 రోజుల్లో పూర్తి చేశాం.సినిమా కోసం అందరం చాలా కష్టపడ్డాం.
సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది.నూటికి నూరు శాతం పూర్తి అయ్యింది.
రీ రికార్డింగ్ మొదలు అయ్యింది.అలాంటి సమయంలో ఒక రోజు నిర్మాత మరియు కంగనాలు ప్రివ్యూ చూస్తూ సినిమాలో సోనూసూద్ పాత్రను తగ్గించాలని నాతో అన్నారు.
అందుకు నేను నో అన్నాను.సినిమాలో ఆ పాత్రను తగ్గిస్తే చరిత్రను మార్చినట్లు అవుతుంది.
అలా చరిత్రను మార్చడం నా వల్ల కాదు.చరిత్రలో ఉన్నట్లుగానే సినిమాను షూటింగ్ జరపాలని అనుకున్నాను.
అందుకే ఉన్నది ఉన్నట్లుగా అనుకున్నట్లుగా తీశాను.కాని సోనూసూద్ పాత్రను వారు మద్యలోనే చంపేందుకు నిర్ణయించుకోవడంతో నాకు ఇష్టం లేదు.
మీ ఇష్టానుసారంగా చేయండి అన్నట్లుగా నేను తప్పుకున్నాను.సోనూసూద్ తో రీ షూటింగ్ కు ఒప్పించే ప్రయత్నం చేశారు.
కాని ఆయన క్రిష్ చేయకుంటే చేయను అన్నాడట.దాంతో ఆయన్ను పూర్తిగా తొలగించి మరో నటుడిని తీసుకు రావడం జరిగిందని క్రిష్ అన్నాడు.