పవన్ కళ్యాణ్ 27వ సినిమాకు దర్శకత్వం వహించే బాధ్యతను క్రిష్ తీసుకున్న విషయం తెల్సిందే.వీరిద్దరి కాంబోలో మూవీకి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయ్యింది.
ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు పెట్టాలనుకుంటున్న సమయంలో అనూహ్యంగా సినిమాకు కరోనా అడ్డు వచ్చింది.పవన్ 26వ సినిమా వకీల్ సాబ్ మూవీ పూర్తి అయితే తప్ప క్రిష్ దర్శకత్వంలో మూవీ పట్టాలెక్కదు.
పవన్ లేకుండా ఒక షెడ్యూల్ ను పూర్తి చేసిన క్రిష్ పవన్ కోసం ఎదురు చూస్తున్నాడు.ఈ సమయంలో ఆయన కొండ పొలం అనే సినిమాను వైష్ణవ్ తేజ్ తో చేసేందుకు సిద్దం అయ్యాడు.
పవన్ తో మూవీ పెట్టుకుని ఒక చిన్న సినిమా చేయడం ఏంటీ అంటూ క్రిష్ పై కొందరు విమర్శలు కురిపించారు.కాని పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేసి కేవలం రెండు నెలల్లో సినిమాను చేస్తాను.
మీరు వకీల్ సాబ్ సినిమా షూటింగ్ పూర్తి చేసే లోపే నేను కొండపొలం సినిమాను పూర్తి చేసి వస్తాను అంటూ నమ్మకంగా చెప్పాడు.
తాజాగా ఆ విషయాన్ని క్రిష్ సామ్ జామ్ షో లో చెప్పాడు.తాను పవన్ కళ్యాణ్ గారికి ఆ విషయం చెప్పినప్పుడు వెంటనే ఓకే అన్నారు.సాదారణంగా అయితే వెంటనే ఎవరు ఒప్పుకోరు.
కాని పవన్ కళ్యాణ్ గారు ఓకే చెప్పారు.ఆయన ఓకే చెప్పిన తర్వాత సినిమా పనులు మొదలు పెట్టాను.
వైష్ణవ్ తేజ్ మరియు రకుల్ లు ఇద్దరు కూడా ఒకే రోజున ఓకే చెప్పారు.సినిమాను 45 రోజులు పూర్తిగా అడవిలో చిత్రీకరించాలనుకున్నాం.
అనుకున్నదాని కంటే అయిదు రోజుల ముందే సినిమా షూటింగ్ ను ముగించేశాం.కోవిడ్ కారణంగా ఒక బబుల్ ను ఏర్పాటు చేసి ఆ బబుల్ లో ఉండి షూటింగ్ చేశాం.
షూటింగ్ జరిగే ప్రాంతానికి కనీసం కార్ వ్యాన్ లు కూడా వెళ్లేవి కావు.అలాంటి చోట షూటింగ్ జరిపామని వైష్ణవ్ మరియు రకుల్ లు ఇద్దరు కూడా బాగా సహకరించారు అంటూ క్రిష్ అన్నాడు.
ఈ సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఆహాలోనే ఆ సినిమా వస్తుందేమో అని, అందుకే వారు ఆహాలో వచ్చారు అంటున్నారు.