యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.ఈ క్రమంలో ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ రిలీజ్కు రెడీ అయ్యింది.
కాగా కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఓ సినిమా చేసేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు.ఈ సినిమాకు సలార్ అనే టైటిల్ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు.
కాగా సలార్ చిత్రాన్ని పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రశాంత్ నీల్ తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు.
ఇక ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర చాలా పవర్ఫుల్గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్గా ఎవరు నటిస్తారా అనే అంశంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
కాగా ఈ సినిమాలో తొలుత దిషా పటానిని హీరోయిన్గా తీసుకోవాలని చిత్ర యూనిట్ భావించింది.కానీ దిషా పటానీ బిజీ షెడ్యూల్ కారణంగా ఆమెను కాకుండా ఇప్పుడు మరో స్టార్ బ్యూటీని సలార్ చిత్రంలో తీసుకునేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
సౌత్తో పాటు నార్త్లోనూ మంచి క్రేజ్ దక్కించుకున్న అందాల భామ శృతి హాసన్ను ఈ సినిమాలో తీసుకునేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తే ఈ జంటను చూసేందుకు ఆడియెన్స్ పెద్దగా ఆసక్తి చూపుతారని, అందుకే ఆమెను ఈ సినిమాలో తీసుకోవాలని చిత్ర యూనిట్ ఆలోచిస్తుంది.
ఆమెను దాదాపుగా ఈ సినిమాలో ఫైనల్ చేసినట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.ఏదేమైనా ప్రభాస్ సరసన శృతి హాసన్ అయితే సలార్ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ దక్కడం ఖాయమని చిత్ర యూనిట్ భావిస్తోంది.
ఇక రీసెంట్గా క్రాక్ చిత్రంతో టాలీవుడ్లో తిరిగి కమ్బ్యాక్ ఇచ్చింది ఈ బ్యూటీ.క్రాక్ చిత్రం సూపర్ సక్సెస్ కావడంతో, ఇప్పుడు ఏకంగా సలార్ చిత్రంలో ఆఫర్ వచ్చి పడింది ఈ బ్యూటీకి.