కరోనా కారణంగా దాదాపు 10 నెలల పాటు సినిమాలన్నీ కూడా విడుదల ఆగిపోయాయి.అప్పటి నుండి కూడా ప్రేక్షకులు ఎంటర్ టైన్ మెంట్ లేక ఓటీటీ ల వెంట పడ్డారు.
మళ్లీ థియేటర్లు ఓపెన్ అయితే జనాలు వచ్చే అవకాశం ఉందా లేదా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేశారు.కాని ఇప్పటికి ఎప్పటికి థియేటర్లు ఇచ్చే ఎంటర్ టైన్ మెంట్ ను మరే ప్లాట్ ఫామ్ లు కూడా బీట్ చేయలేవు అంటూ నిరూపితం అయ్యింది.
సంక్రాంతి సందర్బంగా విడుదల అయిన సినిమాలు అన్ని కూడా మంచి వసూళ్లు నమోదు అయ్యాయి.ముఖ్యంగా క్రాక్ మూవీ వసూళ్లను చూస్తుంటే కరోనా ఉందా లేదా అన్నట్లుగా అనిపిస్తుంది.
వరుసగా భారీ ఎత్తున వసూళ్లు రాబడుతూ దూసుకు పోతుంది.ప్రస్తుతం సినిమా కు సంబంధించిన వసూళ్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉన్నాయి.
మొదటి అయిదు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ను దక్కించుకుంది.19 కోట్ల రూపాయలను కేవలం అయిదు రోజుల్లోనే రాబట్టిన ఈ సినిమా ఇంకా వసూళ్ల సందడి కొనసాగిస్తూనే ఉంది.ఇప్పటి వరకు దాదాపుగా 28 కోట్లను దక్కించుకుంది.నిర్మాత మరియు ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం క్రాక్ కు ఏకంగా పది కోట్ల వరకు లాభాలు వచ్చినట్లుగా తెలుస్తోంది.
సినిమా విడుదల సమయంలో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంది.దాంతో అసలు సినిమా విడుదల అయ్యేనా నిర్మాతకు మరింతగా కష్టాలను మిగిల్చేనా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.కాని అనూహ్యంగా నిర్మాత ఠాగూర్ మధుకు ఏకంగా 10 కోట్లను లాభాలుగా తెప్పించింది.టైటిల్ కు తగ్గట్లుగానే క్రాక్ కలెక్షన్స్ ఉన్నాయి అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే.