టీడీపీలో చేరిన కోట్ల కుటుంబం! కర్నూల్ అభివృద్ధికి కట్టుబడి ఉంటా అని బాబు హామీ!

కర్నూల్ జిల్లాలో కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, అతని ఫ్యామిలీ ఈ రోజు చంద్రబాబు సమక్షంగా తన కార్యకర్తలతో కలిసి టీడీపీలో చేరారు.బారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఈ కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డికి పార్టీ కండువా కప్పి చంద్రబాబు అతనిని టీడీపీలో ఆహ్వానించారు.

 Kotla Family Joins Tdp In Kurnool-TeluguStop.com

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఏపీలో కర్నూల్ అభివృద్ధికి కట్టుబడి వున్నా అని స్పష్టం చేసారు.అలాగే కర్నూల్ లో ఇప్పటికే సాగు నీటి ప్రాజెక్ట్స్ ఏర్పాటుకి ప్రణాళిక సిద్ధం చేశా అని తెలియజేసిన బాబు కర్ణాటక ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే ప్రాజెక్ట్ పనులని స్టార్ట్ చేస్తామని తెలియజేసారు.

అలాగే మళ్ళీ అధికారంలోకి వస్తే కర్నూల్ లో హై కోర్ట్ బెంచ్ ఏర్పాటుకి ప్రయత్నం చేస్తా అని హామీ ఇచ్చారు.ఈ రోజు కోట్ల కుటుంబం కర్నూల్ ప్రజల అభివృద్ధి కోరుకుంటూ టీడీపీలో చేరుతుందని వారికి ఇచ్చిన హామీ ప్రకారం కర్నూల్ లో ప్రజల సంక్షేమం బాద్యతని టీడీపీ ప్రభుత్వం తీసుకుంటుంది అని బాబు హామీ ఇచ్చారు.

అలాగే ఇక నేను రాయలసీమ బిడ్డని అని అందుకే రాయలసీమని అభివృద్ధి వైపు నడిపించే బాద్యత తీసుకొని ఉత్తమంగా తీర్చి దిద్దే వరకు విశ్రమించనని బాబు తెలియజేసారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube