కోటా శ్రీనివాసరావు. తెలుగు సినిమా పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు.
ఈయన ఎన్నో అద్భుత సినిమాల్లో నటించి మంచి జనాదరణ దక్కించుకున్నాడు.విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో అద్భుత సినిమాలు చేశాడు.
సినిమాల పరంగా ఆయన ఎన్నో ఉన్నత స్థానాలకు చేరుకున్నా.నిజ జీవితంలో మాత్రం పలు సమస్యలు ఎదుర్కొన్నాడు.
తాజాగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.తన జీవితంలో అనుభవించిన బాధలను వెల్లడించాడు.ఇంతకీ తను ఏ విషయాలు చెప్పాడో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
1968 లోరుక్మిణి అనే అమ్మాయితో కోటా శ్రీనివాసరావుకు పెళ్లి అయ్యింది.ఈయనకు ఇద్దరు బిడ్డలు.ఓ కొడుకున్నాడు.అయితే ఓ సారి బెజవాడలో సరదాగా కోట శ్రీనివాస రావు కుమార్తె అలాగే కొందరు బంధువులు సరదాగా రిక్షా ఎక్కారట.వారి సరదా తన జీవితంలో ఊహించని సంఘటన అన్నాడు కోటా శ్రీనివాసరావు.ఈ ఘటన తమను దుఃఖ సాగరంలో ముంచేసిందన్నాడు.లారీ వీరు ప్రయాణిస్తున్నరిక్షాని ఢీకొట్టడంతో కోట కూతురు కాలు పోయిందట.ఆమె భవిష్యత్ ఏంటా అని కుటుంబ సభ్యులు ఆందోళన చెందారట.అదే సమయంలో కోటా పని చేసిన బ్యాంకులో ఎవరి దగ్గర అయితే గుమస్తాగా ఉన్నదో వారింటికే ఆయన కూతురు కోడలిగా వెళ్ళిందట.
మంచి కుటుంబంలో ఆమె జీవితం సంతోషంగా ఉందని కోటా వెల్లడించాడు.ప్రస్తుతం తన కూతురు హ్యాపీగా ఉందని చెప్పాడు.ఆమెకు కూతురు కూడా ఉందట.అందరు సంతోషంగా ఉన్నారని వెల్లడించాడు.ఒకప్పుడు ఆయన గుమస్తా గా పని చేసిన వ్యక్తి ఇంటికి కోటా వియ్యంకుడుగా మారారు.కోట శ్రీనివాసరావు ఇప్పటికీ నటనలో తన టాలెంట్ చూపించేందుకు ఆసక్తి కనబరుస్తున్నాడు.
అవకాశాలు ఇవ్వాలని అడుగుతున్నాడు.కొన్ని సినిమా ఆఫర్స్ ఆయనను పలకరిస్తూనే ఉన్నాయి.
అయితే వయసు సహకరించకపోవడంతో ఇంటికే పరిమితం అయ్యాడు.అటు సినిమా పరిశ్రమలోని పలు విషయాల గురించి ఆయన స్పందిస్తూనే ఉన్నాడు.