మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య’ గురించి రోజుకో వార్త మీడియాలో ప్రచారం జరుగుతోంది.టైటిల్ గురించి గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న వార్తలు నిజమే అని క్లారిటీ ఇస్తూ ఆచార్య టైటిల్ను చిరంజీవి ప్రకటించాడు.
ప్రస్తుతం మరో కీలక వార్తపై అధికారిక ప్రకటన ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి షూటింగ్స్తో బిజీగా ఉన్నాడు.
ఈ సమయంలోనే మరో కీలక పాత్ర కోసం మహేష్ బాబు రంగంలోకి దిగబోతున్నాడు అంటున్నారు.
ఆచార్య ప్రారంభం అయినప్పటి నుండి కూడా చిరంజీవితో పాటు ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.అయితే చరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉన్నాడు.ఆ కారణంగానే ఆచార్యలో నటించేందుకు ఛాన్స్ లేదు.
త్వరలోనే ఆచార్యలో చరణ్ కోసం అనుకున్న పాత్రను మహేష్బాబు చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.కేవలం నెల రోజుల డేట్లు ఇచ్చేందుకు గాను ఏకంగా పాతిక కోట్ల రూపాయలను చిత్ర యూనిట్ సభ్యులు ఆఫర్ చేశారట.
చిరంజీవితో సినిమా చేయాలనే ఆసక్తి ఉండటంతో పాటు కొరటాల శివ దర్శకత్వంలో మూవీ అవ్వడం వల్ల తప్పకుండా చేద్దాం అంటూ మహేష్బాబు ఒప్పుకున్నాడు.వీరిద్దరి కాంబో వర్కౌట్ అవుతుందని అంతా చాలా నమ్మకంగా ఉన్నారు.శ్రీమంతుడు మరియు భరత్ అనే నేను చిత్రం భారీ విజయాలను దక్కించుకున్నాయి.కనుక ఈ రెండు సినిమాల తరహాలోనే ఆచార్య సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.