మిర్చి చిత్రం నుండి మొదలైన కొరటాల శివ సక్సెస్ జర్సీ కొనసాగుతూనే ఉంది.దర్శకుడు కొరటాల శివ కెరీర్ ఆరంభం నుండి కూడా తన అన్ని సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్తో పాటలు చేయించాడు.
దాదాపు అన్ని సినిమాలు కూడా మ్యూజికల్గా సక్సెస్ అయ్యాయి.అందుకే కొరటాల తర్వాత సినిమా మెగా 152కి కూడా ఖచ్చితంగా కొరటాల శివ సంగీతం అందించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం.150 సినిమాకు దేవి సంగీతం అందించగా సూపర్ హిట్ అయ్యింది.
చిరు 151వ సినిమా సైరాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించలేదు.దాంతో ఆ సినిమా ఫలితం ఎటూ కాకుండా మిగిలింది.ఇలాంటి సమయంలో చిరు 152 సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ను కాకుండా సీనియర్ సంగీత దర్శకుడు అయిన మణిశర్మను ఎంపిక చేశారు.ఈమద్య కాలంలో మణిశర్మ కేవలం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రమే కొడుతున్నాడు.
సినిమాలకు పాటలను ట్యూన్ చేసేందుకు ఆయన శ్రద్ద చూపడం లేదు అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
అయినా కూడా సంగీత దర్శకుడి విషయంలో ఏముందిలే అనుకుంటున్నారో లేదంటే మరేదో కారణం కాని దర్శకుడు కొరటాల శివ మాత్రం ఇప్పుడు తన కొత్త సినిమాకు గాను మణిశర్మతో వర్క్ చేసేందుకు సిద్దం అయ్యాడు.వచ్చే నెలలో ప్రారంభం కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.ప్రముఖ సంగీత దర్శకుడిని వదిలేసి కాలం చెల్లిన సంగీత దర్శకుడితో పాటలు చేయించడం వల్ల సినిమాపై విమర్శలు వచ్చే అవకాశం ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
కొరటాల సెంటిమెంట్ను బ్రేక్ చేస్తున్న కారణంగా సినిమా హిట్ అయ్యేనా అంటూ అనుమానాలు కూడా వస్తున్నాయి.