భరత్ అనే నేను చిత్రం విడుదల దాదాపుగా సంవత్సరం కాబోతుంది.అయినా కొరటాల శివ ఇప్పటి వరకు తన తదుపరి చిత్రాన్ని మొదలు పెట్టింది లేదు.
కొరటాల శివ తదుపరి చిత్రం చిరంజీవి హీరోగా రూపొందబోతున్న విషయం తెల్సిందే.ప్రస్తుతం సైరా చిత్రంతో బిజీగా ఉన్న కారణంగా చిరంజీవి డేట్లు ఇవ్వలేక పోతున్నాడు.
దాంతో కొరటాల శివ రెడీ అయిన స్క్రిప్ట్నే మళ్లీ మళ్లీ మార్పులు చేర్పులు చేస్తూ ఉన్నాడు.మార్చి లేదా ఏప్రిల్ నుండి సినిమా చిత్రీకరణ దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది.
దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం ఆ పనిలో ఉన్నాడు.
హీరోగా చిరంజీవి ఫైనల్ అయ్యాడు, ఇక మిగిలిన నటీనటుల ఎంపిక మాత్రం ఇంకా ఒక కొలిక్కి రాలేదు.హీరోయిన్ ఎవరు అనే విషయంలో గత ఆరు నెలలుగా చర్చ జరుగుతూనే ఉంది.ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్లో కాజల్, నయన్, అనుష్కల్లో ఎవరో ఒకరు అయితేనే చిరంజీవికి సెట్ అవుతారు.
కాజల్ ఇప్పటికే నటించింది, నయన్ ప్రస్తుతం చిరంజీవితో నటిస్తోంది.మిగిలి ఉన్న అనుష్క మాత్రం బాగా లావు పెరిగి ఉండటం వల్ల చిరంజీవికి సరి జోడీ కాదేమో అనిపిస్తుంది.
కాని అనుష్క తప్ప మరే ఛాన్స్ లేక పోవడంతో ఆమెతో కొరటాల చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది.
సైజ్ జీరో చిత్రం కోసం అనుష్క చాలా లావు పెరిగింది.ఆ తర్వాత లావు తగ్గేందుకు చాలా ప్రయత్నించింది.కాని ఆమె లావు తగ్గలేక పోయింది.
ఆంటీ మాదిరిగా మారిపోయింది.అయితే ఇప్పటికైనా అనుష్క లావు తగ్గితే అందంగా ఉంటుందని అభిమానులు అంటున్నారు.
అందుకే మార్చి వరకు 60 కేజీలకు బరువు తగ్గితే చిరంజీవితో తాను తీయబోతున్న చిత్రంలో ఛాన్స్ ఇస్తానంటూ కొరటాల శివ నుండి అనుష్కకు హామీ దక్కిందట.అయితే ఇన్నాళ్లు బరువు తగ్గలేక పోయిన అనుష్క ఈ చిన్న గ్యాప్లో తగ్గేనా చూడాలి.
కొరటాల శివ ఇచ్చిన టాస్క్లో అనుష్క సక్సెస్ అవుతుందా లేదా చూడాలి.