ప్రస్తుతం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన అందాల తార త్రిష నటిస్తోంది.
ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్నారు.
అయితే ఈ చిత్రానికి ఇప్పటికే “ఆచార్య” అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
అయితే గత కొద్ది రోజులుగా ఈ చిత్రానికి సంబంధించి నటువంటి పలు వార్తలు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.ఇందులో ముఖ్యంగా చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ ఈ చిత్రంలో కొన్ని కీలక సన్నివేశాల్లో నటిస్తున్నాడని అలాగే రామ్ చరణ్ సరసన బాలీవుడ్ గ్లామర్ డాల్ కియారా అద్వానీ నటిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి.
అలాగే కే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్నట్లు కూడా పలు పుకార్లు వినిపిస్తున్నాయి.కానీ ఇప్పటి వరకూ ఈ వార్తలపై దర్శకుడు కొరటాల శివ కానీ, చిత్ర యూనిట్ సభ్యులు గాని ఎవరు స్పందించ లేదు.
అయితే తాజాగా ఈ చిత్రంపై వస్తున్నటువంటి రూమర్స్ గురించి కొరటాల శివ కొంతమేర టెన్షన్ పడుతున్నట్లు సమాచారం.అంతేకాక ఈ చిత్రంలో రామ్ చరణ్ మహేష్ బాబు ఉ నటించడం లేదని ఇప్పటికే తనతో సన్నిహితంగా ఉన్నటువంటి వారితో చెప్పినట్లు తెలుస్తోంది.అయితే విషయం ఇలా ఉండగా ఈ చిత్రం ఇప్పటికే దాదాపుగా సగానికిపైగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది.అంతేగాక ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేసేందుకు దర్శకుడు కొరటాల శివ సన్నాహాలు చేస్తున్నాడు.