టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి రాజమౌళి దర్శకత్వంలో నటించిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 1100 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టి ఎన్టీఆర్, చరణ్ లను పాన్ ఇండియా స్టార్ లుగా మార్చేసింది.ఇక ఇప్పుడు ఓటిటిలో కూడా దుమ్ములేపుతూ హాలీవుడ్ స్టార్స్ తో పాటు ప్రేక్షకులను కూడా ఆకట్టు కుంటుంది.
ఎన్టీఆర్ ఈ సినిమా భారీ విజయం తర్వాత కొరటాల శివ తో సినిమా చేయనున్నాడు.అయితే ఇప్పటి వరకు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు.పలు కారణాల వల్ల ఈ సినిమా సెట్స్ మీదకు ఇంకా వెళ్ళలేదు.కానీ బ్యాకప్ లో మాత్రం స్పీడ్ గా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఎన్టీఆర్ ఈ సినిమా కోసం 9 కేజీల బరువు తగ్గుతున్నాడు.దీని కోసం ఇప్పటికే కసరత్తులు కూడా స్టార్ట్ చేసాడు.
ఆగష్టులో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఎన్టీఆర్ 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి తాజాగా ఒక అప్డేట్ బయటకు వచ్చింది.
స్క్రిప్ట్ వర్క్ ని కొరటాల ఆల్ మోస్ట్ పూర్తి చేసి కాన్ఫిడెంట్ గా ఉన్నారట.మొన్నటి వరకు క్లైమాక్స్ విషయంలో ఇబ్బంది పడిన కొరటాల ఇప్పుడు దానిని కూడా అధిగమించాడని టాక్.
అలాగే ఇప్పటికే కొరటాల క్లైమాక్స్ కోసం భారీ స్థాయిలో సెట్ వేయిస్తున్నాడని.ఈ సెట్ లో తెరకెక్కించే సన్నివేశాలు ఈ సినిమాకే హైలెట్ గా నిలవనున్నాయని తెలుస్తుంది.
ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో ఇప్పటి వరకు ఎన్టీఆర్ కు జోడీగా ఎవరు నటిస్తున్నారో కన్ఫర్మ్ చేయలేదు.ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోయిన్ ల పేర్లు వినిపిస్తుండగా ఇంకా ఇంకా ఎవ్వరిని కొరటాల ఫైనల్ చేయలేదు.మరికొద్ది రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది.ఇక ఈ సినిమాను యువసుధ సుధ ఆర్ట్స్ బ్యానర్ పై సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్నాడు.