కొరటాల కాదు నేనే కోర్టుకు వెళ్తానంటున్న రాజేష్‌

ఆచార్య కథ వివాదం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.సాదారణంగా చిన్న నిర్మాతలు చిన్న హీరోలు ఇతరుల కథలను తస్కరించడం మనం చూస్తూ ఉంటాం.

 Chiranjeevi Koratala Siva Acharya Story Controversial , Koratala Siva, Acharya,-TeluguStop.com

వారికి క్రెడిట్‌ ఇవ్వకుండా వారిని బెదిరించి లేదా ఏదోలా ఒప్పందం చేసుకుని రాజీ కుదుర్చుకుంటారు.కాని పెద్ద సినిమాలకు మాత్రం ఇలాంటి వివాదాలు జరుగకుండానే ప్రయత్నిస్తారు.

అయితే ఆచార్యకు ఆ విషయం పెద్ద తలనొప్పిగా మారింది. రామ్‌ చరణ్‌ నిరంజన్‌ రెడ్డిలు కలిసి నిర్మిస్తున్న ఆచార్య కథ విషయంలో రాజేష్‌ మండూరి గత కొన్ని రోజులుగా మీడియా ముందు వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెల్సిందే.

ఆచార్య కథ తనది అంటూ రాజేష్‌ చేసిన వ్యాఖ్యలను ఇప్పటికే చిత్ర యూనిట్‌ సభ్యులు మరియు మైత్రి మూవీ మేకర్స్‌ వారు క్లారిటీ ఇచ్చారు.ఆచార్య దర్శకుడు కొరటాల శివ కూడా తాను రెడీ చేసుకున్న కథను కావాలని వివాదాస్పదం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

నేను దీన్ని సహించను.అతడిపై లీగల్‌ యాక్షన్‌ తీసుకుంటాను అంటూ హెచ్చరించాడు.

ఈ సమయంలోనే రాజేష్‌ కూడా లీగల్‌ యాక్షన్‌ కు సిద్దం అవుతున్నట్లుగా ప్రకటించాడు.

రాజేష్‌ గతంలోనే చిరంజీవి మరియు కొరటాలతో మాట్లాడేందుకు ప్రయత్నించినట్లుగా పేర్కొన్నాడు.

అయితే ఈ విషయంలో వారి నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో చేసేది లేక లీగల్‌ గా చర్యలు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా పేర్కొన్నాడు.త్వరలోనే ఆచార్య చిత్ర నిర్మాతలకు, దర్శకుడు కొరటాలకు మరియు మైత్రి మూవీ మేకర్స్‌ కు నోటీసులు ఇవ్వబోతున్నట్లుగా రాజేష్‌ తెలియజేశాడు.

ఒక వైపు కొరటాల మరియు మరో వైపు రాజేష్‌ లు కూడా లీగల్ యాక్షన్‌ కు సిద్దం అవుతున్న నేపథ్యంలో ఏం జరిగేనా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube