ఈ మధ్య కాలంలో స్టార్ దర్శకులు నిర్మాతలుగా మారి సినిమాలు నిర్మిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.సంపాదించిన డబ్బుని మళ్ళీ సినిమా మీదనే ఖర్చు పెట్టాలని భావిస్తున్న దర్శకులు, హీరోలు ఇప్పుడు తమ పెట్టుబడులు సినిమాల మీదనే పెట్టి కొత్త టాలెంట్ ని పరిచయం చేస్తున్నారు.
ఈ పనిని పూరీ జగన్నాథ్ ఎప్పుడు కెరియర్ ఆరంభంలోనే మొదలు పెట్టాడు.అయితే పూరీ నిర్మాతగా అన్ని సినిమాలు తన సొంత దర్శకత్వంలోనే తెరకెక్కించారు.
అయితే ఇప్పుడు దర్శకులు మాత్రం తమ శిష్యులని దర్శకులుగా పరిచయం చేసే పని పెట్టుకున్నారు.
ఈ దారిలో ముందు వరుసలో వినిపించే పేరు సుకుమార్.
సుకుమార్ నిర్మాతగా మారి కుమారి 21ఎఫ్ తో మొదటి సక్సెస్ కొట్టడంతో పాటు తన శిష్యుడు సూర్య ప్రతాప్ ని దర్శకుడుగా పరిచయం చేశాడు.ఇప్పుడు బుచ్చిబాబు, అలాగే మరో శిష్యుడుని కూడా దర్శకులుగా మారుస్తున్నాడు.
చిన్న బడ్జెట్ తో మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు తీస్తూ హిట్స్ కొడుతున్నాడు.ఇప్పుడు సుకుమార్ దారిలోనే స్టార్ దర్శకులు కొరటాల శివ కూడా వస్తున్నాడు.
తాను కూడా సొంత ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి ఒక స్టార్ హీరోతో సినిమా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాడు.అయితే ఇది తన దర్శకత్వంలో ఉంటుందా లేక తన శిష్యుడుని దర్శకుడుగా పరిచయం చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది.
అలాగే నిర్మాతగా కొరటాల శివ ఎంత వరకు సక్సెస్ అవుతాడు అనేది వేచి చూడాలి.