విశ్వనటుడు కమల్ హాసన్ కూతురుగా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీఇచ్చిన ముద్దుగుమ్మ శృతిహాసన్.మొదటి సినిమా బాలీవుడ్ లో చేసిన ఈ భామ తెలుగులో సిద్ధార్థ జోడిగా అనగనగా ఒకదీరుడు సినిమా లో ఎంట్రీ ఇచ్చింది.
అయితే ఆ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేక పని భామ రెండోసారి సిద్ధార్థ తో కలిసి ఓ మై ఫ్రెండ్ అనే సినిమాలో నటించింది.ఈ సినిమా కూడా శృతి హాసన్ కి అనుకున్న స్థాయిలో సక్సెస్ అందించలేకపోయింది.
అయితే మొదటి సారి పవన్ కళ్యాణ్ కి జోడిగా గబ్బర్ సింగ్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ఈ భామ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస అవకాశాలు అందుకుంది.
తెలుగు తమిళ భాషల్లో స్టార్ హీరోలకు జోడిగా నటించిన ఈ భామ ఊహించని విధంగా రెండేళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుంది.
ఆ మధ్య కాలంలో మైకేల్ అనే తన బాయ్ ఫ్రెండ్ తో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగే ఈ భామ ఊహించని విధంగా అతనికి ఈ మధ్య బ్రేకప్ చెప్పింది.అతని కారణంగానే సినిమాలు వదిలేసిన శృతి హాసన్ మళ్ళీ హీరోయిన్ గా అవకాశాలు అందుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఆమెకు ఊహించని విధంగా తెలుగులో లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో హీరోయిన్ గా తీసుకోవడానికి సంప్రదించినట్లు తెలుస్తుంది.మరోవైపు గోపీచంద్ మలినేని రవితేజ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాలో కూడా శృతి హాసన్ ని హీరోయిన్ గా తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.