టాలీవుడ్ స్టార్ దర్శకుడు కొరటాల శివ దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా కూడా కోట్లు సంపాదిస్తున్నాడు.ఆయన పెద్దగా పెట్టుబడి పెట్టకుండా తన బ్రాండ్ వాల్యూ మరియు స్క్రిప్ట్ వర్క్ చూస్తూ దర్శకత్వంలో సలహాలూ సూచనలు ఇస్తూ సినిమా పర్యవేక్షణ చేసినందుకు గాను సమర్పకుడిగా పేరు వేయించుకున్నాడు.
దాంతో సినిమా సుకుమార్ ది అనే బ్రాండ్ వల్ల బయ్యర్లు మరియు ప్రేక్షకులు సినిమా ను ఎగబడి చేస్తున్నారు.కొన్ని సినిమాలు సక్సెస్ అవ్వగా కొన్ని నిరాశ పర్చినా కూడా సుకుమార్ కు మాత్రం లాభాలు వస్తున్నాయి.
ఉప్పెన సినిమా కు సుకుమార్ పది పైసలు పెడితే పది రూపాయలు వచ్చాయి అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.కోట్ల రూపాయలు ఉప్పెన ద్వారా సంపాదించిన సుకుమార్ దారిలో కొరటాల శివ నడువ బోతున్నాడు.
కొరటాల శివ ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్.ఇప్పటి వరకు పరాజయం లేని దర్శకుడు ఈయన.వరుసగా సక్సెస్ లు దక్కించుకుంటున్న కొరటాల శివ ప్రస్తుతం ఆచార్య సినిమా ను చేస్తున్నాడు.ఆ తర్వాత ఎన్టీఆర్ తో సినిమాను చేయబోతున్నాడు.
ఈ రెండు సినిమా లతో పాటు ఆయన నిర్మాణం కూడా మొదలు పెట్టాడు.
తన నిర్మాణ సంస్థలో మొదటి సినిమా ను యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో సత్యదేవ్ తో నిర్మించబోతున్నాడు.ఈ సినిమా విజయవాడ బ్యాక్ డ్రాప్ లో కొనసాగుతుందని ఇండస్ట్రీ వర్గాల వార అంటున్నారు.ఇక ఈ సినిమా కు గాను గోపాల కృష్ణ దర్శకత్వం వహించబోతున్నాడు.
కృష్ణ కొమ్మల పాటి నిర్మిస్తున్న ఈ సినిమా ను కొరటాల శివ సమర్పించబోతున్నాడు.మరి కొరటాలకు మొదటి సమర్పణలో లాభాలు వచ్చేనా చూడాలి.
కొరటాల శివ నిర్మాతగా కూడా సూపర్ హిట్ అవుతాడా అనేది చూడాలి.