మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహా రెడ్డి సినిమా టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.ఇక ఈ సినిమా తర్వాత స్టార్ దర్శకుడు కొరటాల దర్శకత్వంలో సినిమాని చిరంజీవి సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు.
ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసుకొని షూటింగ్ కి సిద్ధం అవుతుంది.మెగాస్టార్ ఒకే అనడమే ఆలస్యం, సెట్స్ పైకి వెళ్ళిపోవడానికి కొరటాల సిద్ధం అయ్యాడు.
ఇక ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా అనుష్క నటిస్తుందని గత కొంత కాలంగా టాక్ వినిపించింది.ఇక బాలీవుడ్ భామల పేర్లు కూడా వినిపించాయి.
ఇదిలా ఉంటే ఇక ఈ సినిమాలో సీనియర్ స్టార్ హీరోయిన్స్ కంటే కొత్త వాళ్ళపై ద్రుష్టి పెట్టడంపై కొరటాల ఆసక్తి చూపిస్తున్నాడు అనే టాక్ ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తుంది.మెగాస్టార్ కి జోడీగా న్యూ పేస్ అయితే కథా పరంగా బెటర్ అనే అభిప్రాయంతో ఉన్న కొరటాల ఆ దిశగా చూస్తున్నట్లు తెలుస్తుంది.
దీని కోసం ఇప్పటికే చాలా మంది కొత్త భామలని ఆడిషన్ చేసాడని టాక్ వినిపిస్తుంది.ఇక సినిమా కోసం హీరోయిన్ ని ఇప్పటికే ఫైనల్ చేసాడని తెలుస్తుంది.
మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే సినిమా ప్రారంభం అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే.