బుల్లితెర అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ నాల్గువ సీజన్.ఏడో వారినికి చేరుకుంది.
ఇప్పటికే బిగ్ బాస్ ఇంటి నుంచి ఎడుగురు ఎలిమినేట్ కాగా.ఈ వారం మరొకరు దుకాణం సద్దేయనున్నారు.
ఇదిలా ఉంటే.ఈ వారం బిగ్ బాస్ ఇంటి సభ్యులకు `కొంటె రాక్షసుడు- మంచి మనుషులు` అనే లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చారు.
ఈ టాస్క్లో అరియానా, మెహబూబ్, అఖిల్, అవినాష్, హారికలు రాక్షసులుగా.మిగిలిన వారు మనుషులుగా బిగ్ బాస్ డివైడ్ చేశాడు.
ఈ టాస్క్లో రాక్షసులు ఎంత విసిగించినా.మనుషులు శాంతంగానే ఉండాలి.అలాగే బిగ్ బాస్ ఇచ్చిన టాస్కుల్లో మనుషులు విజయం సాధించి.రాక్షసులను మనుషులుగా మార్చుకోవాల్సి ఉంటుంది.
ఇక ఈ టాస్క్ స్టాట్ అవ్వగానే అరియానా నిజమైన రాక్షసిలా మారిపోయి ప్రవర్తించింది.నోయల్పై గుడ్డు పగలగొట్టి రచ్చ రచ్చ చేసింది.
మరోవైపు హారిక అమ్మ రాజశేఖర్ మాస్టర్కు చుక్కలు చూపించింది.
ఐస్ ముక్కలను మాస్టర్ షర్ట్లో వేసి తెగ ఇబ్బంది పెట్టింది.
అయితే ఈ క్రమంలోనే బిగ్ బాస్ మనుషులను రెండు టాస్కులు ఇచ్చాడు.అందులో మొదటిది.
స్విమ్మింగ్ పూల్లో ఉన్న పువ్వులతో యాబై దండలు అల్లాలని బిగ్ బాస్ చెప్పారు.అయితే ఓవైపు రాక్షసులు ఎంత చెడగొడుతున్నా చివరకు మనుషులు 54 దండలు అల్లి విజయం సాధించడంతో పాటు అఖిల్ను మనిషిగా మార్చారు.
ఇక రెండో టాస్క్ క్లేతో వంద ప్రమిదలు చేయాలని చెప్పగా.మనుసులు ఏకంగా 160 ప్రమిదలు చేసి విజయం సాధించారు.దీంతో ముందు మెహబూబ్ను మనిషిగా మార్చాలని అనుకుంటారు.కానీ, అతడు దొరకడు.
చివరకు సోహైల్కు హారిక దొరకడంతో.చేసేదేమి లేక ఆమెనే మనిషిగా మార్చేస్తాడు.
అయితే మొదట తన పేరు చెప్పలేదు, మెహబూబ్ పేరు చెప్పారు.చివరకు నేను దొరకడంతో నన్ను మనిషిగా మార్చారు.
తాను మనిషిగా మారడం ఎవ్వరికీ ఇష్టం లేదని కెమెరా ముందుకు వచ్చి హారిక ఏడ్చేస్తుంది.ఈ క్రమంలోనే లగ్జరీ బడ్జెట్లో వచ్చే ఒక్క వస్తువును కూడా తీసుకోనని శపదం చేస్తుంది.