మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కొండపొలం.వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెన తోనే సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.అందుకే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకుని విడుదల కోసం వేచి ఉంది.ఈ సినిమా ఉప్పెన కంటే ముందే విడుదల అవ్వాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఉప్పెన సినిమా ముందు విడుదల అయ్యింది.
అయితే ఇప్పుడు ఈ సినిమాను అక్టోబర్ 8న రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
విడుదల దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు చిత్ర యూనిట్.ఇక ఈ క్రమంలోనే మేకర్స్ కొండపొలం మేకింగ్ వీడియోను విడుదల చేసారు.ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో చిత్ర యూనిట్ కరోనా కారణంగా, భారీ వర్షాలు కారణంగా ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొంటు షూటింగ్ చేసిందో ఈ వీడియోలో కనిపిస్తుంది.
ఈ వీడియో చూస్తుంటేనే థియేటర్స్ లో థ్రిల్లింగ్ ఫీలింగ్ ఎంజాయ్ చేయచ్చని ఇది ఒక ఎడ్వెంచరస్ రైడ్ లాగా అనిపిస్తుంది.
ఈ మేకింగ్ వీడియో చూస్తేనే చిత్ర యూనిట్ మొత్తం ఈ సినిమా కోసం ఎంతలా కష్టపడ్డారో తెలుస్తుంది.ఈ సినిమా మొత్తం అడవి నేపథ్యంలోనే ఉంటుంది.ఇటీవల విడుదలైన ట్రైలర్ లో అడవి బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ సన్నివేశాలతో పక్కా గ్రామీణ నేపథ్యంలో ఉన్న ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
ఈ సినిమాలో తేజ్ గొర్రెల కాపరిగా నటిస్తుండగా.రకుల్ లాయర్ పాత్రలో కనిపించ బోతుంది.ఇక ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించగా.
ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.మరి చూడాలి ఈ సినిమా ఎంత బాగా ప్రేక్షుకులను ఆకట్టుకుంటుందో.