బీజేపీలోకి కొండా విశ్వేశ్వర రెడ్డి.. డీకే అరుణతో భేటీ..!

తెలంగాణాలో బీజేపీలోకి మరో కీలక అభ్యర్ధి చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే టీ.

 Konda Visweswar Reddy Met Dk Aruna , Bjp, Dk Aruna, Konda Bjp, Konda Visweswar R-TeluguStop.com

ఆర్.ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ త్వరలో కాషాయ పార్టీ కండువ కప్పుకుంటారని తెలుస్తుంది.ఈటల రాజేందర్ తో పాటుగా ఏనుగు రవీందర్ మరో ఐదుగురు బీజేపీలోకి వెళ్తున్నారని సమాచారం.అయితే మరోవైపు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి కూడా బీజేపీ తీర్ధం పుచ్చుకుంటారని వార్తలు వస్తున్నాయి.

టీ.ఆర్.ఎస్ తరపున ఎంపీగా గెలిచిన విశ్వేశ్వర రెడ్డి గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు.

ఓటమి తర్వాత కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్న కొండ బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

గురువారం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో విశ్వేశ్వర రెడ్డి సమావేశం అయ్యారు.విశ్వేశ్వర రెడ్డిని అరుణ బీజేపీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తుంది.ఆయన కూడా దీనికి సానుకూలంగా స్పనించారని తెలుస్తుంది.అన్ని కుదిరితే త్వరలోనే కొండా విశ్వేశ్వర రెడ్డి కూడా బీజేపీలోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

ఈటల రాజేందర్ తో పాటుగా విశ్వేశ్వర రెడ్డి చేరితే తెలంగాణాలో బీజేపీ బలంగా తయారవుతుందని చెప్పొచ్చు. వీరే కాదు త్వరలో మరికొంతమంది టీ.ఆర్.ఎస్ నాయకులు బీజేపీ బాట పడతారని చెబుతున్నాయి రాజకీయ వర్గాలు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube