హుజురాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి వాతావరణం టీఆర్ఎస్ వర్సెస్ బిజెపి అన్న తరహాలో తెలంగాణ రాజకీయాల్లో క్రియేట్ అయింది.దీంతో టిఆర్ఎస్- బిజెపి నాయకులు నువ్వానేనా అన్నట్టుగా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు.
బిజెపి పార్టీ నుండి మాజీ మంత్రి ఈటల రాజేందర్ బరిలోకి దిగుతున్నట్లు వార్తలు రాగా మరోపక్క టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ నీ ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేయడం జరిగింది.దీంతో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తో మంత్రి హరీష్ రావు నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నారు.
పరిస్థితి ఇలా ఉంటే కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసే అభ్యర్థి విషయంలో ఎక్కువగా వినబడుతున్న పేరు కొండా సురేఖ.ఈ క్రమంలో ఆమె హుజురాబాద్ ఉప ఎన్నికల పోటీ కి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఉప ఎన్నికలలో పోటీ చేయడానికి తాను సిద్ధమేనని అంటూ కండిషన్ పెట్టారు.మేటర్ లోకి వెళ్తే వరంగల్ తూర్పు నియోజకవర్గం సీటును తమ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఇస్తానని హామీ ఇస్తే ఖచ్చితంగా హుజురాబాద్ ఓపెన్ ఎన్నికలలో పోటీ చేస్తానని కొండా సురేఖ స్పష్టం చేశారు.
మరి ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.