కోన వెంకట్ స్క్రిప్ట్ అంటే ఎవరో ఒకరి మీద సెటైర్ పడుతూనే ఉంటుంది.తాజాగా శుక్రవారం విడుదలైన శంకరాభరణంలోనూ అలాంటి సెటైర్ ఉంది.
బోయపాటి శీను- దేవిశ్రీ ప్రసాద్ మధ్య లెజెండ్ విజయోత్సవ వేడుకలో ఓ వాగ్వాదం జరిగింది.ఆర్టిస్టుల నుంచి, టెక్నీషియన్ల నుంచి తనకు కావాల్సినదాన్ని పిండుకున్నానని బోయపాటి అంటే, పిండుకోవడానికి నేనేమైనా ఆవునా? గేదెనా? ఇక్కడ ఎవరి బాధ్యత వారికి తెలుసు.ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటారు.అని దేవీ కౌంటర్ ఇచ్చాడు.ఆ తర్వాత ఇద్దరూ మరుసటి షాపింగ్మాల్కి వెళ్లి, కలిసి లంచ్ చేసి తమ మధ్య పొరపాచ్ఛాలు ఏమీ లేవని కూడా మీడియాకు ఫోటోలు పంపించారు.కానీ సీన్ కట్ చేస్తే తన సినిమాలకు అతి ఇష్టంగా దేవిశ్రీని పెట్టుకునే బన్ని కూడా తన దర్శకుడు చెప్పిన ప్రకారం ఇప్పుడు సెట్స్ మీదున్న సరైనోడుకు తమన్ను పెట్టుకున్నారు.
దర్శకుడికి, సంగీత దర్శకుడికి తప్పకుండా మంచి అండర్స్టాండింగ్ ఉండాలనే ఉద్దేశంతో బన్ని అలా వదిలేశాడని టాక్.ఇదంతా ఇలా ఉండగా దాదాపు అందరూ మర్చిపోతున్న తరుణంలో ఈ డైలాగులను కృష్ణభగవాన్ పాత్ర ద్వారా కోన వెంకట్ ప్రజలకు మరోసారి గుర్తుచేశాడు.
కోనవెంకట్ కథ, స్క్రీన్ప్లే, మాటలు, సమర్పణతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేసిన శంకరాభరణం సినిమాలో ఈ డైలాగులు విన్నవారందరికీ ఇవి సెటైర్లని అర్థమయిపోతున్నాయి.