టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి నటించిన కొత్త సినిమా ‘నిశబ్ధం’ ఎప్పుడో షూటింగ్ ముగించుకుని రిలీజ్ను పలుమార్లు వాయిదా వేసుకుంటూ వచ్చింది.అయితే అతి కష్టం మీద ఏప్రిల్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని చూసిన చిత్ర యూనిట్కు కరోనా వైరస్ దిమ్మతిరిగేలా చేసింది.
వరుసగా లాక్డౌన్ అమలులో ఉండటంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.దీంతో లాక్డౌన్ ముగియగానే ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
కానీ లాక్డౌన్ ముగిసినా కూడా ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే సంకేతాలు కనిపించడం లేదని, దీంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకే చిత్ర యూనిట్ ఆసక్తి చూపుతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపించాయి.అయితే ఈ వార్తలపై తాజాగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన కోన వెంకట్ క్లారిటీ ఇచ్చాడు.
నిశబ్ధం సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసేందుకే ఎక్కువ ఆసక్తి చూపుతున్నామని, కానీ ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తామని ఆయన అన్నారు.
దీంతో ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేదు కాబట్టి, నిశబ్ధం సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకే చిత్ర యూనిట్ ప్రయత్నిస్తుందని తెలుస్తోంది.
పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమాను హేమంత్ మధుకర్ డైరెక్ట్ చేస్తుండగా ఈ సినిమాలో మాధవన్, అంజలి, షాలినీ పాండే తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.మరి నిశబ్ధం చిత్రాన్ని థియేటర్స్లో చూస్తామా లేక సైలెంట్గా ఓటీటీలోనే చూస్తామా అని అనుష్క ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.