ప్రముఖ నిర్మాత డివివి దానయ్య మరియు ప్రముఖ రచయిత కోన వెంకట్లపై నిన్న రాత్రి సమయంలో హైదరాబాద్ శివారు ప్రాంతంలో దారి కాసి కొందరు దోపిడి దొంగలు దాడి చేయడం జరిగింది.రామ్చరణ్ పుట్టిన రోజు సెలబ్రేషన్స్కు వెళ్లి వస్తున్న వీరిపై దుండగులు దాడికి దిగారు.
కారును అడ్డగించి గొడ్డలు చూపించి వారి వద్ద ఉన్న బంగారం మరియు డబ్బును ఇవ్వాలంటూ డిమాండ్ చేశారట.దాంతో నిర్మాత దానయ్య మరియు రచయిత కోన వెంకట్లు తమ వద్ద ఉన్న చైన్లు మరియు ఉంగరాలను వారికి ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
వీరి కారు వెనుకాలే వచ్చిన మరో కారులో దర్శకుడు శ్రీనువైట్ల మరియు సంగత దర్శకుడు థమన్ ఉన్నారు.దోపిడి దారులను గమనించిన డ్రైవర్ వెంటనే కారును వెనక్కు మరల్చడం జరిగింది.
దాంతో శ్రీనువైట్ల మరియు థమన్లు తప్పించుకున్నారు.లేని పక్షంలో వారిపై కూడా దుండగులు దాడికి తెగబడే వారని అంటున్నారు.
వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది.కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం దుండగులను పట్టుకునే పనిలో ఉన్నారు.
ఈ ఘటన ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్లో చర్చనీయాంశం అయ్యింది.ప్రకాష్ రాజ్ ఫామ్ హౌస్లో చరణ్ బర్త్డే వేడుకలకు హాజరై వస్తుండగా ఈ సంఘటన జరిగింది.