మరి కొద్దిసేపటిలో పెళ్లి అనగానే ఆ పెళ్లి మండపం లో ఎంత సందడి ఉంటుంది.బంధు వర్గం తో కూడిన ఆ మండపంలో హడావుడి గా అందరూ అటూ ఇటూ తిరుగుతూ సంతోషాలు పంచుకుంటూ ఉంటారు.
అయితే ఇంత ఆనందం లో మునగాల్సిన ఆ పెళ్లి లో అనుకోని ఘోరం చోటుచేసుకుంది.కొద్దీ గంటల్లో పెళ్లి జరుగుతుంది అనుకున్న సమయంలో పెళ్లి కొడుకు శవమై కనిపించడం అందరినీ విషాదానికి నెట్టేసింది.
మరో కొద్దీ గంటల్లో పెళ్లి పీటలు ఎక్కి తాళి కట్టాల్సిన పెళ్ళికొడుకు అదే మండపంలోని రూమ్ లో ఆత్మహత్య చేసుకోవడం ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది.హైదరాబాద్ లోని కొంపల్లి లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
అసలు ఏమి జరిగింది? ఎందుకు అతడు ఇలా ఆత్మహత్య చేసుకున్నాడో అన్న విషయం అర్ధం కాక ఇరు కుటుంబాలు అయోమయంలో ఉండిపోయాయి.
ఎంతో సంతోషంగా పెళ్ళికి అంగీకరించిన ఆ యువకుడు అసలు ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది అన్న విషయం మాత్రం వారికి అర్ధం కానీ ప్రశ్నగానే ఉంది.అయితే అసలు పెళ్ళికి కొద్దీ గంటల ముందు ఇలా సూసైడ్ అదీ పెళ్లి మండపం లోనే చేసుకోవడానికి గల కారణాలు ఏంటి? ఒకవేళ ఎవరైనా చంపేశారా? లేదంటే ఎవరైనా బ్లాక్ మెయిల్ చేయడం వల్ల ఇలా చనిపోయాడా అన్న విషయాలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.