కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గుడ్ బై చెప్పారు.మునుగోడు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాంట్రాక్టుల కోసం రాజీనామా చేస్తున్నానని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని వాపోయారు.
మునుగోడులో ఎటువంటి అభివృద్ధి జరగడం లేదన్న ఆయన.తన రాజీనామా ద్వారా ప్రజలకు కొంత మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వలనే తెలంగాణలో పార్టీ బలహీనపడిందని కోమటిరెడ్డి తెలిపారు.అనంతరం మునుగోడు ఉప ఎన్నికల్లో ఎవరు గెలవాలన్నది ప్రజలే నిర్ణయిస్తారని వ్యాఖ్యనించారు.
తన పదవి త్యాగంతోనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.