ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఏపీలో టికెట్ రేట్ల అమ్మకాలకు సంబంధించి ఒక వెబ్ సైట్ ను తయారు చేయబోతున్నట్టు కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.ప్రభుత్వం నుంచి రిలీజైన ఉత్తర్వుల్లొ ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఈ వెబ్ సైట్ ను నిర్వహిస్తుందని వెల్లడించింది.
టాలీవుడ్ స్టార్ హీరోలు ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గురించి స్పందించడానికి ఏ మాత్రం ఇష్టపడటం లేదు.
అయితే తెలుగు, తమిళ భాషల్లో గుర్తింపును సంపాదించుకున్న విశాల్ సీం జగన్ తీసుకున్న నిర్ణయానికి హ్యాట్సాఫ్ చెబుతున్నానని అన్నారు.
తమిళనాడులో కూడా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని కోరుకుంటున్నానని విశాల్ చెప్పుకొచ్చారు.సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లంతా జగన్ నిర్ణయాన్ని స్వాగతించాలని థియేటర్ల కలెక్షన్లలో ఈ నిర్ణయం వల్ల పారదర్శకత వస్తుందని విశాల్ పేర్కొన్నారు.
విశాల్ అభ్యర్థనను తమిళనాడు సీఎం స్టాలిన్ పట్టించుకుంటారో లేదో చూడాల్సి ఉంది.ప్రస్తుతం విశాల్ ఎనిమీ అనే సినిమాలో నటిస్తుండగా దసరా కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది.ఈ సినిమాతో పాటు సామాన్యుడు అనే మరో సినిమాలో కూడా విశాల్ నటిస్తున్నారు.విశాల్ తన సొంత బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తుండగా ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.
మిగతా కోలీవుడ్ హీరోలు కూడా జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తారేమో చూడాల్సి ఉంది.మరోవైపు టాలీవుడ్ కి చెందిన పలువురు సినీ ప్రముఖులు మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుండటం గమనార్హం.దేవాకట్టా సీఎం జగన్ నిర్ణయంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.త్వరలో ఏపీ నుంచి మెగాస్టార్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు సీఎం జగన్ ను కలిసి టికెట్ రేట్ల గురించి చర్చించనున్నారని సమాచారం.