మన పెద్దలు పొరుగింటి పుల్లకూరే రుచి అనే సామెతను చెబుతూ ఉంటారు.ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ఈ సామెతను ఫాలో అవుతూ ఉండటం గమనార్హం.
టాలీవుడ్ హీరోలు తెలుగు దర్శకుల కంటే కోలీవుడ్, బాలీవుడ్ దర్శకులతో పని చేయడానికే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న సినిమాలలో ఎక్కువ సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్నాయి.
కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న శంకర్ తన డైరెక్షన్ తో ఎన్నో సంచనలన విజయాలను సొంతం చేసుకున్నారు.త్వరలో శంకర్ టాలీవుడ్ హీరో రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే.బన్నీ మురుగదాస్ కాంబోలో ఒక సినిమా తెరకెక్కనున్నట్టు చాలా సంవత్సరాల నుంచి వినిపిస్తుండగా మాస్ మసాలా కథాంశంగా ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.
కన్నడ నాట స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ తెలుగులో ప్రభాస్ తో సినిమా చేస్తుండగా ఎన్టీఆర్ తో సినిమా చేయాల్సి ఉంది.బన్నీ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో కూడా ఒక సినిమా తెరకెక్కే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.కోలీవుడ్ ఇండస్ట్రీలో విజయాలను సొంతం చేసుకుంటున్న లోకేష్ కనగరాజ్ చరణ్ తో ఒక సినిమా చేయాలని ఆసక్తి చూపిస్తున్నారని ఒక వార్త వైరల్ అవుతోంది.
తమిళంలో డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న లింగుస్వామి రామ్ తో తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేయనున్నారు.తమిళంలో ఆదిత్య వర్మ పేరుతో అర్జున్ రెడ్డి సినిమాను తెరకెక్కించిన గిరీశయ్య వైష్ణవ్ తేజ్ తో ఒక సినిమాను తెరకెక్కించనున్నారు.మరి టాలీవుడ్ హీరోలు కోలీవుడ్ డైరెక్టర్ల సినిమాలతో విజయాలు అందుకుంటారేమో చూడాల్సి ఉంది.