ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం పెద్ద చర్చనీయాంశంగా మారింది.చాలా మంది తారలు తమకి ఎదురైనా లైంగిక వేధింపుల గురించి మీడియా ముందుకి వచ్చి చెబుతున్నారు.
మీటూ కాంపైన్ లో భాగంగా ఎంతో మంది భామలు తాము ఏ విధంగా లైంగిక వేధింపులకి గురైంది.సినిమా అవకాశాలు అని చెప్పి ఎవరు ఎలా వాడుకున్నది చెప్పారు.
తాజాగా మరో హీరోయిన్ ఇలాంటి వేధింపుల కారణంగా సినిమా ఇండస్ట్రీని వదిలేసినట్లు చెప్పి మరో బాంబ్ పేల్చింది.తమిళ జయం సినిమాలో సదా చెల్లి పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి తరువాత హీరోయిన్ గా ఎదిగిన నటి పూర్నిత.
ఈ అమ్మడు కల్యాణి స్క్రీన్ నేమ్ తో హీరోయిన్ గా తమిళంలో కొన్ని సినిమాలు చేసింది.
ఆ తర్వాత ఉన్నట్లుండి ఇండస్ట్రీ నుంచి దూరమైపోయింది.
తెలుగులో కూడా మళ్లీ మళ్లీ అనే సినిమా ఈ అమ్మాడు హీరోయిన్ గా కనిపించింది.అవకాశాలు భాగా వస్తున్నపుడే ఇండస్ట్రీని ఎందుకు వదిలేసావ్ అనే ప్రశ్నకు ఇప్పుడు కల్యాణి సమాధానం చెప్పింది.
అవకాశాలు ఇస్తామని అంతా పిలుస్తున్నారు.మంచి సినిమాలే కదా వెళ్తే అక్కడ చివరికి వాళ్లు తమకేంటి, పడుకోవాలి మాతో అంటూ అసభ్యకరంగా మాట్లాడటం అనేది కామన్ అయిపోయింది అంటుంది.
అందుకే తాను సినిమాలకు దూరమైపోయానని చెప్పింది.ఆమె తల్లిని కూడా అలాగే కమిట్మెంట్ కోసం వేధించారని, అందుకే ఆమె కూడా సినిమాలకు దూరమైపోయిందని చెప్పింది.
కమిట్మెంట్ కానీ లేకపోయుంటే బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన తాను షాలిని, హన్సిక స్థాయికి ఎదిగి ఉండేదాన్ని అని చెప్పుకొచ్చింది.మొత్తానికి ఇప్పుడు కల్యాణి చేసిన వాఖ్యలు కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.